News March 19, 2025

రాజశేఖర్ టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం?

image

వైసీపీ MLC మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవల జగన్ పెట్టిన ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశానికి సైతం హాజరు కాలేదు. విడదల రజనీకి చిలకలూరిపేట వైసీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పడమూ ఇందుకు ఓ కారణం. పల్నాడులో కీలక నేతను కోల్పోవడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Similar News

News March 20, 2025

చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

image

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

News March 20, 2025

హిందూ గుళ్లపై ప్రభుత్వం పెత్తనం చేయొద్దు:సిర్పూర్MLA

image

హిందూ దేవాలయాలపై పెత్తనం చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్ సహా ఇతర మైనార్టీ సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ గురించి అలాంటి ధోరణి కనబడటం లేదన్నారు. పురాతన దేవాలయాల నిర్వహణకు నోచుకోని ఆలయాల కోసం CGF నిధులను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు.

News March 20, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 20, గురువారం ఫజర్: తెల్లవారుజామున 5.08 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.39 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!