News February 13, 2026

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త కెప్టెన్

image

IPL: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ నియమితులయ్యారు. రియాన్ పరాగ్ తమ సారథి అని ఆ జట్టు ట్వీట్ చేసింది. గతంలో ఈ జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించిన షేన్ వార్న్, రాహుల్ ద్రవిడ్, వాట్సన్, రహానే, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ పేర్లతో పోస్టర్ రిలీజ్ చేసింది. గతేడాది వరకు సారథిగా వ్యవహరించిన సంజూ ట్రేడ్‌లో CSKకు వెళ్లిన విషయం తెలిసిందే. 2025 సీజన్‌లో పలు మ్యాచులకు పరాగ్ కెప్టెన్‌గా చేశారు.

Similar News

News March 13, 2026

పచ్చి ఆకు ఎరువుతో కలిగే ప్రయోజనాలు

image

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు.

News March 13, 2026

ఇంటర్ స్టూడెంట్ దారుణం.. ముగ్గురు బాలికలపై అత్యాచారం

image

TG: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి కామాంధుడిగా మారిన ఘటన నాగర్‌కర్నూల్(D) కొల్లాపూర్(M)లో జరిగింది. ప్రేమ పేరుతో ముగ్గురు తోటి విద్యార్థినులపై అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. డబ్బు ఇవ్వకపోతే వాటిని పేరెంట్స్‌కు పంపుతానని, SMలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఓ బాలిక గర్భం దాల్చగా ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు. ఓ విద్యార్థిని ఫిర్యాదుతో బాలుడితోపాటు ఇద్దరు వైద్యులు, నర్సును పోలీసులు అరెస్టు చేశారు.

News March 13, 2026

SEBI హోల్ టైమ్ మెంబర్‌గా తెలుగు వ్యక్తి!

image

స్టాక్ మార్కెట్లను పర్యవేక్షించే సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో తెలుగు వ్యక్తికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. SEBI హోల్ టైమ్ మెంబర్‌గా మాజీ IDAS అధికారి కేవీ రమణమూర్తిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా SEBIలో పార్ట్‌టైమ్ మెంబర్‌గా పనిచేశారు. సెబీ నిర్ణయాల్లో ఈయన కీలక పాత్ర పోషించనున్నారు.