News February 20, 2025

రాజాం: జగన్ రాక.. హెలిప్యాడ్ స్థల పరిశీలన

image

నేడు పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యుల పరామర్శ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పాలకొండ పట్టణానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి హెలిప్యాడ్ స్థలాన్ని పాలవలస ధవళేశ్వరరావు, రాజాం నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ డా. తలే.రాజేశ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

image

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్‌) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News December 1, 2025

VZM: ‘ఫిర్యాదుదారుల సంతృప్తి స్థాయి పెరగాలి’

image

విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన PGRS వినతులపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సమీక్షించారు. ఫిర్యాదుదారుల్లో సంతృప్తి స్థాయి పెరిగేందుకు కృషి చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆడిట్ అధికారులందరూ PGRSకు విధిగా హాజరుకావాలన్నారు. రెవిన్యూ శాఖకు సంబంధించి మ్యూటేషన్లపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని మండల ప్రత్యేకాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

News December 1, 2025

విజయనగరం: ‘లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి’

image

డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించాలని జిల్లా జడ్జి ఎం.బబిత న్యాయమూర్తులకు సూచించారు. సోమవారం జిల్లా కోర్టు పరిధిలో ఉన్న న్యాయమూర్తులతో ఆమె సమావేశం నిర్వహించారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద భీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కు బౌన్స్, మనీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు వంటి వాటిని ఇరు పార్టీల అనుమతితో శాశ్వత పరిష్కారం చేయాలని తెలిపారు.