News September 19, 2024
రాజాం: పొగిరిలో కాకతీయుల నాటి శిల్పాలు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో 1000 ఏళ్ల కిందటి అపురూపమైన శైవ శిల్పాలు ఉన్నాయని, ఆగ్రామం కాకతీయుల నాడు గొప్ప శైవక్షేత్రంగా వెలసిందని, రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తెలిపారు. బుధవారం ఆ గ్రామానికి వెళ్లగా ఊరి ముందర రోడ్డుపక్కన నాగదేవత శిల్పముంది. అది అక్కడి చెరువు తవ్వుతుండగా దొరికిందని తెలిపారు. ఊర్లో ఉన్న వెయ్యేళ్ళ కిందటి అగస్త్యేశ్వర ఆలయాన్ని పరిశీలించారు.
Similar News
News October 18, 2025
SKLM: రాష్ట్రస్థాయి విజేతగా శ్రీకాకుళం సన్రైజర్స్

విజయవాడలో రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి లీప్ క్రికెట్ టోర్నమెంట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సన్రైజర్స్ జట్టు మొదటి బహుమతి సాధించింది. కృష్ణాజిల్లా విజయం జట్టు రన్నరప్గా నిలిచింది. ఎస్.ఎస్.ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు (ఐఏఎస్) శనివారం విజేతలకు ట్రోఫీలు అందజేశారు. బహుమతి గెలిచిన జిల్లా జట్టును డీఈఓ రవిబాబు అభినందించారు.
News October 18, 2025
మందస: 22 నెలల చిన్నారికి వరల్డ్ రికార్డ్స్లో స్థానం

కేవలం 22 నెలల అతి పిన్నవయసులోనే మందస మండలం డిమిరియాకు చెందిన సీర మయూరి అద్భుత ప్రదర్శన కనబరిచింది. మయూరి తండ్రి సీర సంజీవ్ సాఫ్ట్వేర్, తల్లి శాంతి డాక్టర్గా కాగా.. శ్లోకాలు, పద్యాలను ఇష్టంగా పాడుతున్న చిన్నారి ఆసక్తిని గమనించి వారు తర్ఫీదునిచ్చారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో 15 శ్లోకాలు చెప్పిన మయూరి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ , IB రికార్డ్స్లో స్థానం కైవసం చేసుకుంది.
News October 18, 2025
SKLM: అంబేడ్కర్ గురుకుల హాస్టళ్ల పనులు వేగవంతం చేయండి

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో అత్యవసరంగా చేయాల్సిన పనులను తక్షణమే వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.