News March 25, 2025

రాజానగరం: మాతృత్వాన్ని చాటుకున్న విసీ ప్రసన్న శ్రీ

image

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విద్యార్థులను తన పిల్లలుగా భావిస్తానని చెప్పే వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ .. మరోసారి తన మాతృ హృదయాన్ని చాటుకున్నారు. సోమవారం రాజమండ్రి నుంచి మధ్యాహ్నం వస్తుండగా.. చాళుక్య ద్వారం వద్ద ఒక తల్లి తన బిడ్డను తీసుకొని మండుటెండలో నడుస్తూ వీసీకి కనిపించారు. తన కారు ఆపి, మండుటెండలో వస్తున్న ఆ బిడ్డను తీసుకుని లాలించి తన ఛాంబర్‌కు తీసుకువచ్చారు. ఆమె పని ముగిశాక అప్పగించారు.

Similar News

News December 13, 2025

ఈనెల 14 నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు: SE

image

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ​నిర్వహిస్తున్నట్లు APEPDCL SE కె.తిలక్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో విద్యుత్ పొదుపుపై వినియోగదారులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు, వినియోగదారులకు స్టార్ రేటెడ్ గృహెూపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు.

News December 13, 2025

ఈనెల 15న యథావిధిగా PGRS: కలెక్టర్

image

డిసెంబర్ 15 సోమవారం జిల్లా కలెక్టరేట్ నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. అర్జీదారులు తమ వినతులను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

News December 13, 2025

డిసెంబర్ 20 నుంచి RTC డోర్ డెలివరీ మాసోత్సవాలు: DPTO

image

ఈనెల 20 నుంచి జనవరి 19 వరకు APSRTC డోర్ డెలివరీ మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తూ.గో జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్. మూర్తి శనివారం ప్రకటించారు. నగరాలలో 10 కి.మీ పరిధిలో 50 కేజీల వరకు పార్శిల్స్ డోర్ డెలివరీ జరుగుతుందన్నారు. తక్కువ ధరతో వేగంగా.. సురక్షితంగా మీ ఇంటి వద్దకు అందిస్తామని చెప్పారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ సౌకర్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.