News July 4, 2024

రాజానగరం: రూ.40 లక్షల నిధుల గోల్ మాల్

image

రాజానగరం మండలం జి.యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో రూ.40 లక్షలు గోల్ మాల్ జరిగిందని సమాచారం. దీనికి సంబంధించి బిజినెస్ కరస్పాండెంట్ నానిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారని తూ.గో. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. మహిళా సభ్యులు చేసిన ఫిర్యాదుతో జూన్ 20న విచారణ చేపట్టి నివేదికను అందించారన్నారు. DRDA అధికారి జనార్ధన్ రావు దీనిపై విచారణ చేస్తారన్నారు.

Similar News

News October 15, 2025

RJY: నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె

image

నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాకు ఆయన సమ్మె నోటీసు అందజేశారు. కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే ఈ సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

News October 14, 2025

దీపావళి నేపథ్యంలో భద్రతా చర్యలు తప్పనిసరి: కలెక్టర్

image

దీపావళి పండుగ సందర్భంగా అనుమతులు, భద్రతా చర్యల విషయంలో సంబంధిత అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. టపాసుల హోల్‌సేల్ స్టాక్‌ షెడ్లు, తాత్కాలిక దుకాణాలకు వచ్చే దరఖాస్తులను రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖల త్రిసభ్య కమిటీ ద్వారా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.

News October 13, 2025

రాజమండ్రిలో యువ హీరో సందడి

image

అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా ‘కె – ర్యాంప్’ రూపొందిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. సినిమా ప్రమోషన్ నిమిత్తం ఆయన సోమవారం రాజమండ్రి వచ్చారు. జైన్స్ నాని దర్శకత్వంలో, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదల కానుందని చెప్పారు. సినిమా ఆద్యంతం వేగంగా, స్పీడుగా నడుస్తుందనే ఉద్దేశంతోనే ‘ర్యాంప్’ అనే పేరు పెట్టామని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.