News February 13, 2025
రాజాపేట: ఉరేసుకొని యువకుడి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739449917594_20542147-normal-WIFI.webp)
ఉరేసుకొని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన రాజాపేట మండలంలో జరిగింది. SI అనిల్ కుమార్ తెలిపిన వివరాలు.. రఘునాథపురానికి చెందిన బిట్ల రమేశ్ పెద్ద కుమారుడు పవన్(25) గురువారం ఉదయం ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఘటనాస్థలానిక చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 14, 2025
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో కొరియర్ బాయ్కి గాయాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739459855818_52001903-normal-WIFI.webp)
మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాజు (24) కొరియర్ బాయ్గా పని చేస్తున్నాడు. రాత్రి హైదరాబాద్ వైపు నుంచి తూప్రాన్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తూ రామాయపల్లి బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాజు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
News February 14, 2025
సంగారెడ్డి: ఆన్లైన్లో పదో తరగతి విద్యార్థుల FA మార్కులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739460633085_52434823-normal-WIFI.webp)
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఎఫ్ఏ మార్కుల రికార్డులను పర్యవేక్షణ బృందం గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యవేక్షణ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News February 14, 2025
దామరగిద్ద: జపాన్లో ప్రదర్శనకు ఎంపిక విద్యార్థి ఆవిష్కరణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739437887019_51550452-normal-WIFI.webp)
దామరగిద్ద గురుకుల పాఠశాలకు చెందిన శివారెడ్డి తయారు చేసిన కోకోనట్ ఫైబర్ పాట్స్ ప్రాజెక్టును డిల్లీలో జరిగిన జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిట్స్ జపాన్లో జరిగే సకురా ప్రోగ్రామ్కు ఎంపికైనట్లు గైడ్ టీచర్ జరీనా బేగం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు విద్యార్థిని, గైడ్ టీచర్ను అభినందించారు. రాష్ట్రం నుంచి 4 ప్రాజెక్టులు ఎంపికైనట్లు చెప్పారు.