News February 15, 2025

రాజాపేట తహశీల్దార్‌కు కుచ్చుటోపి

image

రాజాపేట తహశీల్దార్‌కి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. పోలీసుల వివరాలిలా.. గుర్తుతెలియని దుండగుడు తహశీల్దార్‌ దామోదర్‌కు ఫోన్ చేశారు. తాను ఏసీబీ అధికారినని బెదిరించి డబ్బు డిమాండ్‌ చేశాడు. తహశీల్దార్‌ దామోదర్ ఆన్‌లైన్‌లో రూ.3.30 లక్షలు పంపాడు. కాల్ వివరాల ఆధారంగా మోసపోయానని తెలుసుకుని సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. రాచకొండ సైబర్‌ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 19, 2026

కొండపల్లి బొమ్మల పండగ.. డ్రమ్స్ వాయించిన కలెక్టర్

image

కొండపల్లి బొమ్మల పండగ ఆదివారం కనులపండువగా సాగింది. ఉత్సవంలో భాగంగా రాత్రి కలెక్టర్ లక్ష్మీశ డ్రమ్స్ వాయించి కళాకారులను, టూరిస్ట్‌లను ఉత్సాహపరిచారు. ఈ ఉత్సవంలో సుమారు 250 మంది కళాకారులు పాల్గొన్నారు. డ‌ప్పు, పులి వేషాలు, త‌ప్పెట‌గుళ్లు, థింసా, గ‌ర‌గ‌లు, కీలు గుర్రాలు వంటి 12 ర‌కాల సంప్ర‌దాయ క‌ళ‌ల క‌ళాకారుల ప్ర‌ద‌ర్శ‌న‌లు అబ్బుప‌రిచాయి. ఈ పండగ కొండపల్లి వైభవాన్ని చాటుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 19, 2026

కొండపల్లి బొమ్మల పండగ.. డ్రమ్స్ వాయించిన కలెక్టర్

image

కొండపల్లి బొమ్మల పండగ ఆదివారం కనులపండువగా సాగింది. ఉత్సవంలో భాగంగా రాత్రి కలెక్టర్ లక్ష్మీశ డ్రమ్స్ వాయించి కళాకారులను, టూరిస్ట్‌లను ఉత్సాహపరిచారు. ఈ ఉత్సవంలో సుమారు 250 మంది కళాకారులు పాల్గొన్నారు. డ‌ప్పు, పులి వేషాలు, త‌ప్పెట‌గుళ్లు, థింసా, గ‌ర‌గ‌లు, కీలు గుర్రాలు వంటి 12 ర‌కాల సంప్ర‌దాయ క‌ళ‌ల క‌ళాకారుల ప్ర‌ద‌ర్శ‌న‌లు అబ్బుప‌రిచాయి. ఈ పండగ కొండపల్లి వైభవాన్ని చాటుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 19, 2026

ఓపెనర్ల పరుగుల వరద.. తీవ్ర పోటీ

image

టీమ్‌ఇండియా ఓపెనింగ్ స్లాట్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. IPLలో భారత ఓపెనర్లు పరుగుల వరద పారిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్, గిల్, KL రాహుల్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు గిల్ 251 (4 మ్యాచులు), వైభవ్ 246 (6), జైస్వాల్ 223 (6), ఇషాన్ 213 (6), ప్రియాన్ష్ 211 (5), ప్రభ్‌సిమ్రన్ సింగ్ 211 (6), అభిషేక్ 188 (6) రన్స్ చేశారు.