News December 12, 2024

రాజీమార్గమే రాజ మార్గం: MBNR ఎస్పీ

image

రాజీమార్గమే రాజ మార్గం అని MBNR ఎస్పీ జానకి అన్నారు. ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ పడేటట్లు కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికాలకు సూచించారు. ఇద్దరు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారు.. కానీ రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని.. కక్షలతో ఏం సాధించలేమన్నారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

Similar News

News January 15, 2025

NGKL: సీఎంను కలిసిన ఎంపీ మల్లురవి

image

హైదరాబాద్‌లో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మంగళవారం నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దాహోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని తిరిగి రావాలి కోరుకున్నారు.

News January 14, 2025

మల్లికార్జున స్వామికి కైలాస వాహన సేవ

image

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో మంగళవారం మకర సంక్రాంతి పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు, పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.

News January 14, 2025

MBNR: జూ.కళాశాలల్లో సమస్యలు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. బదిలీలు, ఇతర కారణాలతో మొత్తం 14 కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కళాశాలలు ఇన్చార్జుల పాలనలో నడుస్తున్నాయి. వీరు వారి కళాశాలతో పాటుగా అదనపు బాధ్యతలు అప్పగించిన కళాశాలలను కూడా చూసుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక పాలనాపరమైన సమస్యలు నెలకొన్నాయి. పదోన్నతుల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది.