News April 1, 2025
రాజీవ్ యువ వికాస పథకంపై ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశాలు

రాజీవ్ యువ వికాస పథకానికి అర్హులైనవారు ఎక్కువగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాదులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమక్షంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ప్రారంభించినట్టు తెలిపారు.
Similar News
News October 21, 2025
వరంగల్: కాంగ్రెస్లో గులాబీ ముళ్లు

WGL ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఎప్పుడైనా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తాయి. ఇప్పుడు మళ్లీ కొండా వివాదంలో అదే నడుస్తోంది. మేడారం టెండర్ల వివాదం నుంచి ఓఎస్డీ సరెండర్ వరకూ కొండా చుట్టూ ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై నేతల మాటలకు మూతపడ్డాయి. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య బీసీ మహిళ మంత్రిని తొలగించేందుకు కడియం ప్రయత్నిస్తున్నాడని చెప్పడం దుమారం రేపింది.
News October 21, 2025
కూటమి VS కూటమి.. ప్రత్యర్థుల విమర్శలు

బిహార్లో మహా కూటమిలో విభేదాలు ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారాయి. కాంగ్రెస్, RJD, CPI, VIP పార్టీలు గ్రాండ్ అలయెన్స్గా ఏర్పడ్డాయి. అయితే 11 స్థానాల్లో కూటమి నేతలే పరస్పరం పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. 6 సీట్లలో RJD, కాంగ్రెస్, 4 స్థానాల్లో కాంగ్రెస్, CPI, మరో 2 చోట్ల RJD, VIP అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. NDA గెలుపునకు కూటమి బాటలు వేసిందని LJP చీఫ్ చిరాగ్ పాస్వాన్ విమర్శించారు.
News October 21, 2025
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా: కేటీఆర్

TG: తమ పార్టీలో ఉన్నామంటున్న MLAల పేర్లు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటం ఏంటని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రశ్నించారు. ‘ఏ పార్టీలో ఉన్నావంటే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వారికి సిగ్గుందా?’ అని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆలిండియా కరప్షన్ కమిటీ అని, దానికి ఖర్గే, రాహుల్ గాంధీ నాయకులని ఖైరతాబాద్లో బస్తీ దవాఖానా సందర్శన సందర్భంగా KTR విమర్శించారు.