News February 7, 2025
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గోదావరిఖని వాసులు మృతి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి HYD వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న గోదావరిఖనికి చెందిన బాణేష్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్కు తరలించారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 2, 2025
మణికొండలో రూ.300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

HYD మణికొండలో రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి, పార్కు స్థలాలను కబ్జాదారుల నుంచి హైడ్రా విముక్తి చేసింది. పశ్చిమ ప్లాజా సమీపంలో ఎలాంటి పత్రాలు లేని ఎకరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, కబ్జాదారులను ఖాళీ చేయించింది. వెంకటేశ్వర కాలనీ, తిరుమల హిల్స్లోని మొత్తం 7,650 గజాల రెండు పార్కు స్థలాలను కూడా హైడ్రా తిరిగి తీసుకుంది. ఈ స్థలాల్లో హైడ్రా బోర్డులు, ఫెన్సింగ్ను ఏర్పాటు చేసింది.
News November 2, 2025
మణికొండలో రూ.300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

HYD మణికొండలో రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి, పార్కు స్థలాలను కబ్జాదారుల నుంచి హైడ్రా విముక్తి చేసింది. పశ్చిమ ప్లాజా సమీపంలో ఎలాంటి పత్రాలు లేని ఎకరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, కబ్జాదారులను ఖాళీ చేయించింది. వెంకటేశ్వర కాలనీ, తిరుమల హిల్స్లోని మొత్తం 7,650 గజాల రెండు పార్కు స్థలాలను కూడా హైడ్రా తిరిగి తీసుకుంది. ఈ స్థలాల్లో హైడ్రా బోర్డులు, ఫెన్సింగ్ను ఏర్పాటు చేసింది.
News November 2, 2025
దీపం వెలిగిస్తుండగా మంటలు.. బాలిక మృతి

వెల్దుర్తి(M) నర్సాపురంలో నిప్పు అంటుకొని బాలిక మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక మాసం సందర్భంగా గత సోమవారం ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని గొల్ల బుడ్డన్న కుమార్తె రేవతి(9) తీవ్రంగా గాయపడింది. బాలికకు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తుండగా కోలుకోలేక శుక్రవారం మృతిచెందింది. కాగా, ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


