News February 7, 2025

రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గోదావరిఖని వాసులు మృతి

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి HYD వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న గోదావరిఖనికి చెందిన బాణేష్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 11, 2026

టెట్ రిజల్ట్స్.. 42% టీచర్లు అనర్హులే!

image

TG: నిన్న విడుదలైన టెట్ <<19104650>>ఫలితాల్లో<<>> ఏకంగా 27,712(42%) మంది ఇన్ సర్వీస్ టీచర్లు అర్హత సాధించలేదు. మొత్తం 65,605 మంది టీచర్లు పరీక్షకు హాజరయ్యారు. టెట్ ప్రవేశ పెట్టకముందు నియమితులై ఐదేళ్లకు మించి సర్వీసులో ఉన్న టీచర్లు రెండేళ్లలోపు ఒక్కసారైనా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఓవరాల్‌గా 1,95,181 మంది పరీక్ష రాయగా 1,00,270 మంది(51.37%) క్వాలిఫై అయ్యారు.

News February 11, 2026

పల్నాడు: వరకపూడి సెలపై ఎమ్మెల్యేలు గళమెత్తెనా..?

image

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన పలు సమస్యల్ని MLAలు ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా పల్నాడుకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే వరికపూడిసెల ప్రాజెక్టు వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అసెంబ్లీలో చర్చించాలని భావిస్తున్నారు. అదేవిధంగా నాగార్జునసాగర్ కుడి కాలువకు వారబంది విధానం అమలు చేయడం వలన రైతాంగం ఇబ్బందులపై ప్రస్తావించాలంటున్నారు.

News February 11, 2026

ఏలూరు: కోర్టులో ఉద్యోగం.. దరఖాస్తు చేసుకోండి

image

ఏలూరులోని 2వ స్పెషల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో తాత్కాలిక ప్రాతిపదికన కోర్టు అటెండెంట్ పోస్టు భర్తీకి జిల్లా జడ్జి ఎస్. శ్రీదేవి ప్రకటన విడుదల చేశారు. 7 లేదా 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు, రిటైర్డ్ సిబ్బంది ఈ పోస్టుకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 28వ తేదీలోగా ఏలూరు జిల్లా జడ్జి కోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు.