News April 3, 2025

రాజుపాలెం: గంజాయి అక్రమ తరలింపు.. ముగ్గురి అరెస్ట్

image

రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. స్కూల్ బ్యాగ్‌లో అక్రమంగా 4 కేజీల పచ్చి గంజాయి ఆకును తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గంజాయి ఎక్కడకి తీసుకుపోతున్నారనే విషయంపై విచారణ చేపట్టారు.

Similar News

News April 20, 2025

రేపు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

image

AP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాల్లో <>వడగాలులు <<>>వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరంలో-16, మన్యం-11, శ్రీకాకుళం-4 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 20 చోట్ల వడగాలులు వీస్తాయంది. ఇవాళ నంద్యాల(D) ఔకులో 42.6 డిగ్రీలు, తిరుపతి(D) వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడులో 42.5 డిగ్రీలు, నెల్లూరు(D) మనుబోలులో 42.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.

News April 20, 2025

తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను: సీఎం చంద్రబాబు

image

AP: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినవారందరికీ CM చంద్రబాబు ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు అందించిన శుభాకాంక్షలు, చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. 75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాకు తోడునీడగా ఉండి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు.

News April 20, 2025

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

image

విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖ నగర ప్రజలు లా అండ్ ఆర్డర్,క్రైమ్, దొంగతనాలు, ట్రాఫిక్ సమస్యలు,పలు పోలీస్ సంబంధిత సమస్యలపై రేపు ఉదయం 10 గంటల నుంచి వినతులు సమర్పించవచ్చన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అయితే అంబేడ్క‌ర్ జయంతి కారణంగా గత సోమవారం పీజిఆర్ఎస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!