News June 17, 2024

రాజుపాలెం: నడిరోడ్డుపై లారీలో మంటలు

image

లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించిన ఘటన రాజుపాలెం సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. రాజుపాలెం- బెల్లంకొండ రహదారిపై ఒక్కసారిగా లారీకి మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవరు వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపారు. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 19, 2025

తాగునీటిలో మురుగునీరు కలవడంతోనే సమస్య: సీపీఎం

image

గుంటూరులో డయేరియా వ్యాప్తిపై సీపీఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీటి కారణంగానే ఈ సమస్య తలెత్తిందని, అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్‌లో డయేరియా రోగులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే 33 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వర్షాలకు మురుగు నీరు తాగునీటి పైపుల్లో కలిసి ప్రజలకు సరఫరా అవుతోందని ఆరోపించారు.

News September 19, 2025

గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

image

గుంటూరు జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి గురువారం పలు ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి. మొత్తం మీద సగటు వర్షపాతం 4.1 మిల్లీమీటర్లుగా నమోదైంది. పెదనందిపాడు మండలం 15.6 మి.మీ.తో అగ్రస్థానంలో ఉండగా, తుళ్లూరులో కేవలం 1.8 మి.మీ. మాత్రమే పడింది. మంగళగిరి 9.8, తాడికొండ 9.6, కాకుమాను 9.4, చేబ్రోలు 9.2, గుంటూరు పశ్చిమ 9.2, తాడేపల్లిలో 8.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ వర్షాలతో రైతులు కొంత ఊరట పొందారు

News September 19, 2025

సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.