News March 30, 2024

రాజుపాళెం: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

image

రాజుపాళెం మండలం తొండలదిన్నె గ్రామానికి చెందిన నొస్సం బాబుషా (17) అనే యువకుడు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడని ఎస్ఐ తులసీ నాగప్రసాద్ తెలిపారు. నొస్సం సంజీవ్ భూమిని కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేసుకుంటున్నారు. ఆ పొలానికి సాగు నీరు పారించేందుకు కుమారుడు బాబుషా అక్కడికి వెళ్లాడు. నీటిని విడిచే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ మోటార్ కు విద్యుత్ సరఫరా కావడంతో బాబుషా అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News November 18, 2025

కడప: 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలు గుర్తించిన అధికారులు

image

జిల్లాలో గత ప్రభుత్వంలో ఫేజ్-3లో 13,681ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటి నిర్మాణాలను వైసీపీ నేతలు చేపట్టారు. ఇప్పుడు వీటిపై విచారణ జరుగుతోంది. ప్రత్యేక యాప్ ద్వారా ఫిజికల్, ఫైనాన్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలున్నట్లు తెలిపారు. సుమారు 6,713 ఇళ్లు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. 6,258 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు.

News November 18, 2025

కడప: 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలు గుర్తించిన అధికారులు

image

జిల్లాలో గత ప్రభుత్వంలో ఫేజ్-3లో 13,681ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటి నిర్మాణాలను వైసీపీ నేతలు చేపట్టారు. ఇప్పుడు వీటిపై విచారణ జరుగుతోంది. ప్రత్యేక యాప్ ద్వారా ఫిజికల్, ఫైనాన్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలున్నట్లు తెలిపారు. సుమారు 6,713 ఇళ్లు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. 6,258 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు.

News November 18, 2025

ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

image

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.