News March 30, 2024
రాజుపాళెం: విద్యుత్ షాక్తో యువకుడు మృతి

రాజుపాళెం మండలం తొండలదిన్నె గ్రామానికి చెందిన నొస్సం బాబుషా (17) అనే యువకుడు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడని ఎస్ఐ తులసీ నాగప్రసాద్ తెలిపారు. నొస్సం సంజీవ్ భూమిని కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేసుకుంటున్నారు. ఆ పొలానికి సాగు నీరు పారించేందుకు కుమారుడు బాబుషా అక్కడికి వెళ్లాడు. నీటిని విడిచే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ మోటార్ కు విద్యుత్ సరఫరా కావడంతో బాబుషా అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News February 8, 2026
గాండ్ల సంక్షేమ కార్పొరేషన్ కోసం CMకు వినతి

గాండ్ల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును శనివారం విజయవాడలో కలిసి విన్నవించినట్లు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య తెలిపారు. గాండ్ల సంఘం అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని, నూనె తయారీ యూనిట్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.
News February 8, 2026
కడపలో నేడు పోటీలు.. గెలిస్తే రూ.70 వేలు.!

కడప నగరంలోని బిల్డప్ దగ్గర కొలువైన పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఆదివారం బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి బహుమతి రూ.70 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా ఐదు బహుమతులు వరకు ఉంటాయన్నారు. ఎద్దుల యజమానులు నిర్దేశించిన సమయంలో అక్కడికి చేరుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు.
News February 7, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.16,040
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,757
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,670.


