News April 4, 2025
రాజేంద్రనగర్: గృహప్రవేశంలో పాల్గొన్న సీఎం రేవంత్

రాజేంద్రనగర్లో ఇవాళ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి సోదరుడు ఎలిగంటి వెంకట్రెడ్డి గృహప్రవేశ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎంను మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పలువురు నాయకులు ఉన్నారు.
Similar News
News November 27, 2025
పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.
News November 27, 2025
సిరిసిల్ల: ఫేజ్ 1 నామినేషన్ కేంద్రాల క్లస్టర్ జాబితా విడుదల

రాజన్న సిరిసిల్ల(D) వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం ఫేజ్ 1లో ఏర్పాటైన నామినేషన్ కేంద్రాల క్లస్టర్ వివరాలను గురువారం అధికారులు విడుదల చేశారు. చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడ, వేములవాడ రూరల్ మండలాల్లోని మొత్తం 31 క్లస్టర్లకు హెడ్క్వార్టర్ కేంద్రాలు నిర్ణయించి, గ్రామపంచాయతీలు, వార్డుల సంఖ్యను ఖరారు చేశారు. అభ్యర్థులు సంబంధిత నామినేషన్ కేంద్రాల్లో పత్రాలు సమర్పించాలని సూచించారు.
News November 27, 2025
ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <


