News March 29, 2024

రాజేష్ మహాసేన పోస్ట్.. APR 1న ఏం చెప్పనున్నారు..?

image

రాజేష్ మహాసేన సోషల్ మీడియోలో పెట్టిన పోస్ట్‌పై ఆసక్తి నెలకొంది. ‘తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, పార్టీ మారుతానని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 2019లో జగన్ కోసం పని చేసి మోసం పోయాం. తర్వాత జనసేన కోసం కష్టపడ్డా అవకాశం రాలేదు. TDP నుంచి అనివార్య కారణాలతో అవకాశం కోల్పోయాం. అందుకే ‘మహాసేన’ చెప్పినట్లు చేయాలనుకుంటున్నా. అదేంటో APR 1న తెలిజయేస్తా’ అని రాసుకొచ్చారు. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.

Similar News

News March 6, 2026

‘పోలవరం’ ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం.. CMకు ఉండవల్లి బహిరంగ లేఖ

image

పోలవరం ప్రాజెక్టులోని లోపాలపై హెచ్చరిస్తూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం గ్యాప్-2 ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వ్యత్యాసాలను చెబుతూ పూర్తిస్థాయి డిజైన్‌కు ఆమోదం లేకుండా పనులు చేయడం ప్రమాదకరమని ఉండవల్లి అన్నారు. ఆనకట్ట పునాది స్థాయిలో వ్యత్యాసం ఉండటం వల్ల స్థిరత్వం దెబ్బతింటుందని, పునాది కింద ఇసుక కోతకు గురైతే పోలవరం డేంజర్‌లో పడుతుందని హెచ్చరించారు.

News March 6, 2026

మార్చి 7న రాజమండ్రిలో జాబ్ మేళా: కలెక్టర్

image

మార్చి 7వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో టీటెన్త్, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, బీటెక్, M.B.A ఉత్తీర్ణులై 35 ఏళ్లలోపు వయస్సు గల అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 6, 2026

మార్చి 7న రాజమండ్రిలో జాబ్ మేళా: కలెక్టర్

image

మార్చి 7వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో టీటెన్త్, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, బీటెక్, M.B.A ఉత్తీర్ణులై 35 ఏళ్లలోపు వయస్సు గల అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.