News February 28, 2025

రాజోలులో అగ్నిమాపక అధికారి మృతి

image

ఒక్కరోజు డ్యూటీ చేసుంటే పూర్తిగా విశ్రాంతి తీసుకునేవారు. అంతలోనే ఆకస్మికంగా మృతి చెందారు. రాజోలు గాంధీనగర్‌లో ఉంటున్న అగ్నిమాపక అధికారి బాలకృష్ణ (62) నిన్న ఉదయం మృతిచెందారు. రాజోలు అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్‌మెన్‌గా పనిచేసి 3నెలల క్రితం పదోన్నతిపై ముమ్మిడివరం ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. రోజూ మాదిరిగానే బైక్‌పై డ్యూటీకి వెళ్తుండగా రాజోలులో ఆకస్మికంగా బైక్‌పై నుంచి పడి చనిపోయారు.

Similar News

News March 1, 2025

MHBD: ప్రైవేట్ కళాశాలల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: PDSU

image

మహబూబాబాద్ పట్టణంలోని ప్రైవేట్ కళాశాల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి బానోతు దేవేందర్ డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల వద్దకు ప్రైవేట్ కళాశాలల యజమాన్యం వెళ్లి విద్యార్థుల సమాచారం తీసుకొని వారి అనుమతి లేకుండా అడ్మిషన్లు చేసి ఫీజు కట్టాలని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News March 1, 2025

మహబూబ్ నగర్ జిల్లా నేటి ముఖ్యంశాలు

image

✓మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం.✓నేటితో ముగిసిన కుల గణన సర్వే.✓రాజాపూర్‌లో పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇసుక రీచ్‌లు ధ్వంసం.✓ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు. ✓దేవరకద్రలో రైలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.✓దేవరకద్ర: వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.✓భూత్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

News March 1, 2025

ఆహారం నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో ఉన్న వసతిగృహాలలో మంచినీరు, ఆహారం నాణ్యతపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ సూచించారు. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్.ఎస్.ఎమ్.ఇ. సర్వే మార్చి 15నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో అతిసార, మలేరియా, డెంగ్యూ, కలరా వంటి వ్యాధులు ప్రబలకుండా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

error: Content is protected !!