News January 24, 2025
రాజోలు: ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

రాజోలు మండలం కూనవరం గ్రామంలో శ్రీఅన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం భూమి పూజలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తోందన్నారు. దీనికి ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఎంపీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ముచ్చట్లు

పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో 29 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 155 స్థానాలకు 466 మంది పోటీలో నిలిచారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. 19 గ్రామాలు ఏకగ్రీవం కాగా 146 స్థానాలకు 548 మంది బరిలో ఉన్నారు. గుర్తులు కేటాయించడంతో ప్రచార పర్వం మొదలైంది.
News December 10, 2025
VKB: ఓటేయడానికి ఇవీ తీసుకెళ్లండి !

ఓటర్లు తమ గుర్తింపు కోసం EPIC కార్డు (ఓటర్ ఐడీ) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ఈ క్రింది 18 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి చూపించవచ్చు. ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్బుక్(ఫొటోతో), రేషన్ కార్డు(ఫొటోతో), పట్టాదారు పాస్బుక్, ఉపాధి జాబ్ కార్డు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం(ఫొటోతో), పెన్షన్ తదితర పత్రాల్లో మొదలగునవి చూపించాలి.
News December 10, 2025
25వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం SSC నోటిఫికేషన్ జారీ చేసింది. BSF, ITBP, SSB, CRPF, SSF, AR, CISF విభాగాలన్నింటికీ కలిపి 25,487 ఖాళీలు భర్తీ చేయనుంది. 2026 JAN1 నాటికి టెన్త్ పాసైన 18-23సం.ల మధ్య వయస్సు గల వారు దరఖాస్తుకు అర్హులు. DEC 1 నుంచి మొదలైన <
Share It


