News March 5, 2025
రాజోలు: తప్పిపోయిన బాలిక కథ సుఖాతం

కాకినాడకు చెందిన 7వ తరగతి విద్యార్థిని సాధ్విక సోమవారం రాత్రి తప్పిపోయింది. రాజోలు (M) తాటిపాక సెంటర్లో బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆమె రాజోలు హాస్టల్లో ఉండగా… బాబాయి పెళ్లికి ఇంటికి వెళ్లింది. మంగళవారం నుంచి పరీక్షలు ఉండడంతో మేనమామ హాస్టల్ వద్ద విడిచిపెట్టగా తప్పిపోయింది. స్టేషన్లో ఉన్నట్లు తెలుసుకున్న వార్డెన్ జ్యోతి బాలికను పేరెంట్స్ కు అప్పగించారు.
Similar News
News December 5, 2025
ఏలూరులో అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్: DSP

ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిని అత్యాచారం చేసిన జగదీష్ను అరెస్టు చేశామని DSP శ్రావణ్ కుమార్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. జగదీష్పై దాదాపు 10 కేసులు ఉన్నాయన్నారు. చోరీ కేసులో ఏలూరు కోర్టుకు హాజరయ్యారని ఈ నేపథ్యంలో పాత అక్రమ సంబంధం ఉన్న ఓ మహిళను కలవడానికి వెళ్లిన జగదీష్, భవాని ఘర్షణకు దిగారు. ఘర్షణ పెరగడంతో అక్కడ ఉన్న యువతిని జగదీష్ అత్యాచారం చేశారన్నారు.
News December 5, 2025
పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు: రాజస్థాన్ హైకోర్టు

చట్టబద్ధంగా పెళ్లి వయస్సు రాకున్నా పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఇద్దరు మేజర్లకు ఉందని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. live-inలో ఉన్న తమకు రక్షణ కల్పించాలని కోటాకు చెందిన యువతి(18), యువకుడు(19) కోర్టును ఆశ్రయించారు. వారు చట్టప్రకారం పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని జస్టిస్ అనూప్ తీర్పుచెప్పారు. చట్ట ప్రకారం పురుషుల పెళ్లి వయసు 21 కాగా, మహిళలకు 18 ఏళ్లు ఉండాలి.
News December 5, 2025
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పరిటాల సునీత

అనంతపురం రూరల్ సిండికేట్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్కు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు అనుకూలంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసిందని ఆమె వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.


