News March 5, 2025
రాజోలు: తప్పిపోయిన బాలిక కథ సుఖాతం

కాకినాడకు చెందిన 7వ తరగతి విద్యార్థిని సాధ్విక సోమవారం రాత్రి తప్పిపోయింది. రాజోలు (M) తాటిపాక సెంటర్లో బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆమె రాజోలు హాస్టల్లో ఉండగా… బాబాయి పెళ్లికి ఇంటికి వెళ్లింది. మంగళవారం నుంచి పరీక్షలు ఉండడంతో మేనమామ హాస్టల్ వద్ద విడిచిపెట్టగా తప్పిపోయింది. స్టేషన్లో ఉన్నట్లు తెలుసుకున్న వార్డెన్ జ్యోతి బాలికను పేరెంట్స్ కు అప్పగించారు.
Similar News
News September 18, 2025
VKB: అత్త శ్రద్ధాంజలి బ్యానర్ తీసుకెళ్తూ అల్లుడు మృతి

VKB జిల్లా పుల్మద్ది గ్రామంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన లక్ష్మి మరణించడంతో ఆమె శ్రద్ధాంజలి బ్యానర్ని అల్లుడు శ్రీనివాస్ పట్టణంలో ప్రింట్ చేసుకొని తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు గుంతలో బైక్ పడి కింద పడడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం శ్రీనివాస్పై నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అత్త, అల్లుడు మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
News September 18, 2025
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 10 రోజుల వరకు సభ నిర్వహించే అవకాశముంది. పంచాయతీరాజ్ సవరణ, AP మోటార్ వెహికల్ ట్యాక్స్, SC వర్గీకరణ, మున్సిపల్ చట్టాల సవరణ వంటి 6 ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. సూపర్-6 మొదలు సాగునీటి ప్రాజెక్టుల వరకు 20 అంశాలపై చర్చించేందుకు TDP ప్రతిపాదించొచ్చు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకెళ్లాలని YCP నిర్ణయించుకున్నట్లు సమాచారం.
News September 18, 2025
ధరూర్: పాత ఫోన్లు కొంటున్నారా: ఎస్ఐ

సెకండ్ హ్యాండ్ ఫోన్లతో జాగ్రత్త అవసరమని ఎస్ఐ రాఘవేందర్ హెచ్చరించారు. దొంగలించిన ఫోన్లు లేదా నేరాలను వాడినా ఫోన్లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. వాటిని కొంటే చిక్కుల్లో పడతారని చెప్పారు. కొనుగోలు చేసే ముందు www.ceir.gov.in, వెబ్ సెట్ లో వివరాలు తనిఖీ చేయాలనీ సూచించారు.