News January 25, 2025

రాజోలు: నలుగురు విద్యార్థులకు భారీ ఉపకార వేతనాలు

image

రాజోలు మండలం ఓ ప్రేయివేట్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినిలు రిలయన్స్ ఫౌండేషన్, లెగ్రాండ్ సంస్థలు అందించిన భారీ ఉపకార వేతనాలు అందుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ ఆర్.ఏ.స్వామి శనివారం తెలిపారు. గిరుగు సుష్మ (రూ.4,40,000), చింతా హెప్సిబా (2,00,000), బండారు తేజావతి (2,00,000), ముచ్చర్ల కేశవ కుమారి (2,00,000) ఉపకార వేతనం పొందారని తెలిపారు. భారీ ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులను పలువురు అభినందించారు.

Similar News

News November 26, 2025

పల్నాడు: హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం ఇలా..!

image

పెదకూరపాడు నియోజకవర్గంలోని హెడ్ కానిస్టేబుల్ చైన్ లింక్ ద్వారా తోటి పోలీసులు, సామాన్య ప్రజలతో డబ్బులు కట్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తొలుత డాలర్లు కొనుగోలు చేస్తే తిరిగి వస్తాయి అంటూ కట్టించాడని, తమ వద్ద కమీషన్ పేరుతో డబ్బులు కూడా తీసుకున్నాడని చెబుతున్నారు. చివరకు అతను చెప్పిన విధంగా డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు.

News November 26, 2025

జన్నారం: గంటలో స్పందించిన అధికారులు

image

జన్నారం బస్టాండ్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయని, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని బుధవారం సాయంత్రం 4 గంటలకు WAY2NEWSలో వార్త పబ్లిష్ అయింది. అధికారులు గంటలో స్పందించి బస్టాండ్‌లోని ఫ్లెక్సీలను తొలగించారు. దాంతో పాటు మండలంలో ఉన్న అన్ని ఫ్లెక్సీలను తీసేయించారు.

News November 26, 2025

HNK: ప్రయాణికుల సలహాల కోసం ‘డయల్ యువర్ డీఎం’

image

ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు వారి సూచనల కోసం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. తమ డిపో పరిధిలోని ప్రజలు ఈ నెల 27, గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 8977781103 నెంబరుకు ఫోన్ చేసి, డిపో అభివృద్ధికి విలువైన సలహాలను అందించాలని ఆయన కోరారు.