News January 25, 2025
రాజోలు: నలుగురు విద్యార్థులకు భారీ ఉపకార వేతనాలు

రాజోలు మండలం ఓ ప్రేయివేట్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినిలు రిలయన్స్ ఫౌండేషన్, లెగ్రాండ్ సంస్థలు అందించిన భారీ ఉపకార వేతనాలు అందుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ ఆర్.ఏ.స్వామి శనివారం తెలిపారు. గిరుగు సుష్మ (రూ.4,40,000), చింతా హెప్సిబా (2,00,000), బండారు తేజావతి (2,00,000), ముచ్చర్ల కేశవ కుమారి (2,00,000) ఉపకార వేతనం పొందారని తెలిపారు. భారీ ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులను పలువురు అభినందించారు.
Similar News
News February 24, 2026
HYD: క్యాబినెట్ మీటింగ్లో కీలక అంశాలు

HYDలో ఎలివేటెడ్ కారిడార్ కోసం రక్షణ శాఖకు చెందిన 42 ఎకరాలు తీసుకున్న నేపథ్యంలో బదులుగా కాప్రాలో 153 ఎకరాలు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నియోపోలీస్లో నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పన, కోహెడలో 239 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ ఏర్పాటు కోసం మార్కెట్ కమిటీకి భూకేటాయింపు, CURE ఏరియాలో 2BHK సముదాయాల్లో ఉన్న షాప్స్ వేలం వేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
News February 24, 2026
HMDA పరిధిలోకి వికారాబాద్ జిల్లాలోని 4 గ్రామాలు

విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను HMDA పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను HMDA పరిధిలో చేర్చారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC ఆధ్వర్యంలో CRMP phase 2 చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
News February 24, 2026
HMDA పరిధిలోకి వికారాబాద్ జిల్లాలోని 4 గ్రామాలు

విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను HMDA పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను HMDA పరిధిలో చేర్చారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC ఆధ్వర్యంలో CRMP phase 2 చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.


