News October 3, 2024
రాజోలు: రోడ్డు ప్రమాదంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ మృతి
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామంలో వెలంకాయల కాలవగట్టు ప్రాంతానికి చెందిన సుజాత కేశదాసుపాలెం హైస్కూల్లో హెడ్ మాస్టర్గా విధులను నిర్వర్తిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం ఆమె స్కూటీపై వెళ్తూండగా గొయ్యిని తప్పించే ప్రయత్నంలో పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. కాకినాడ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.
Similar News
News October 3, 2024
నిడదవోలులో రేపు జాబ్ మేళా
నిడదవోలు ఎస్వీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తూ.గో.జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు జాబ్ మేళా మొదలవుతుందని, 5 కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. SSC, డిప్లొమా, డీఫార్మసీ, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ ఎం-ఫార్మసీ చదివిన 19-30 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులన్నారు.
News October 3, 2024
రోజా గారూ.. అప్పుడు ఏమైంది: వాసంశెట్టి
అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా..దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.
News October 3, 2024
KKD: ఆ కసాయి తండ్రి దారుణాలెన్నో..?
కాకినాడ జగన్నాథపురం చెక్కావారి వీధిలో పండ్ల వ్యాపారి శివమణి తన బిడ్డను <<14248309>>చంపేసిన<<>> విషయం తెలిసిందే. చెడు వ్యసనాలకు బానిసైన అతను తన మగబిడ్డను వైజాగ్లో అమ్మేశాడు. భర్త చనిపోయి నాలుగేళ్లుగా ఒంటరిగా ఉంటున్న మహిళతో సహజీవనం చేయగా ఆడబిడ్డ పుట్టింది. ఆబిడ్డను అమ్మేందుకు ప్రయత్నించగా ఎవరూ కొనకపోవడంతో కోపంతో చిన్నారిని గోడకేసి కొట్టి హతమార్చాడు. నిందితుడిని వన్ టౌన్ సీఐ నాగ దుర్గారావు అరెస్ట్ చేశారు.