News March 9, 2025

రాజోలు: హత్య కేసు.. ముగ్గురు అరెస్టు

image

రాజోలు మండలం తాటిపాకకు చెందిన కుమారస్వామి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని రాజోలు ఎస్ఐ రాజేష్ కుమార్ శనివారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన నిందితులు అప్పలరాజు, రాజు, సత్తిబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. జనవరి 28వ తేదీన అనుమానాస్పద స్థితిలో కుమారస్వామి మృతి చెందాడన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై దీన్ని హత్య కేసుగా నమోదు చేసి విచారించి నిందితులను అరెస్టు చేశామన్నారు.

Similar News

News November 16, 2025

ఖమ్మం: అంగన్వాడీల్లో కనిపించని సమయపాలన..

image

జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు బదులు ఆలస్యంగా కేంద్రాన్ని తెరవడం, అలాగే సాయంత్రం 4 గంటలకు ముందే 3 గంటలకే ఇంటికి వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ వెంటనే దృష్టి సారించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News November 16, 2025

19న అకౌంట్లలోకి రూ.7,000?

image

AP: PM కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల 19న రైతుల ఖాతాల్లో కేంద్రం రూ.2వేల చొప్పున జమ చేయనుంది. అదే రోజు రాష్ట్రంలో ‘అన్నదాత సుఖీభవ’ రెండో విడత నిధులను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ.5వేల చొప్పున అన్నదాతల అకౌంట్లలో జమ చేయనుందని సమాచారం. PM కిసాన్‌తోపాటు ‘సుఖీభవ’ స్కీమ్‌నూ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే AUGలో తొలి విడత నిధులను రిలీజ్ చేశారు.

News November 16, 2025

వంటింటి చిట్కాలు

image

* సమోసా పిండిలో కొద్దిగా బియ్యం పిండిని కలిపితే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి.
* బిర్యానీలోకి ఉల్లిపాయలను వేయించే సమయంలో అందులో చిటికెడు చక్కెర వేస్తే ఉల్లిపాయ కరకరలాడుతుంది. అలాగే వేయించడం కూడా త్వరగా పూర్తవుతుంది.
* కూరల్లో కారం, ఉప్పు ఎక్కువైతే స్పూన్‌ శనగపిండి కలపండి.
* ఓవెన్‌లో బ్రెడ్‌ని కాల్చే సమయంలో బ్రెడ్‌తో పాటు చిన్న గిన్నెలో నీరు ఉంచితే.. బ్రెడ్‌ మెత్తగా మంచి రంగులో ఉంటుంది.