News November 26, 2024

రాజ్యాంగంతోనే భారతదేశానికి ఖ్యాతి: జాయింట్ కలెక్టర్

image

నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్ శంకరన్ హాల్లో ఇవాళ నిర్వహించిన రాజ్యంగ దినోత్సవం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడిందంటే దానికి కారణం భారత రాజ్యాంగమేనని అన్నారు. ప్రతిఒక్కరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తితో దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ పిలుపునిచ్చారు.

Similar News

News October 21, 2025

నెల్లూరులో అమరవీరులకు నివాళి

image

పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నెల్లూరులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వేజెండ్ల, పోలీస్ అధికారులు ఘన నివాళులర్పించారు. జోరు వానలోనూ కవాతు నిర్వహించారు. అంకితభావంతో పనిచేస్తూ అమరత్వం పొందిన పోలీసులను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని పలువురు పేర్కొన్నారు.

News October 21, 2025

నేడు నెల్లూరు జిల్లాకు వర్ష సూచన

image

నెల్లూరు జిల్లాలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు సైతం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్స్యకారులు తిరిగి రావాలని సూచించింది. దీపావళి రోజు వర్షం పడటంతో చాలామంది టపాసులు సరిగా పేలలేదు.

News October 20, 2025

కందుకూరు TDPలో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు..

image

కందుకూరు నియోజకవర్గ టీడీపీలో ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు ..’ అన్న సామెత ఆదివారం నిజమైంది. రెండు దశాబ్దాల పాటు TDPలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ MLA డా.దివి శివరాంకు ఆదివారం దారకానిపాడులో కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. శివరాం అనుచరుడిగా, ఆయన పైరవీలతో పార్టీ ఇన్‌ఛార్జ్ అయి, ప్రస్తుతం MLAగా ఉన్న ఇంటూరి నాగేశ్వరావు కుర్చీలో కూర్చుంటే వెనుక వరుసలో శివరాం నిలబడాల్సి వచ్చింది.