News February 1, 2025

రానున్న 10 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి: BHPL కలెక్టర్ 

image

వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా రానున్న 10 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో గ్రామ పంచాయితీ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News November 15, 2025

iBOMMA నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్

image

TG: దేశవ్యాప్తంగా సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తోన్న <<18297457>>iBOMMA<<>> నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కూకట్‌పల్లిలోని ఓ ఫ్లాట్‌లో ఉండగా రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పైరసీల ద్వారా అతను రూ.కోట్లు సంపాదించాడనే ఆరోపణలున్నాయి.

News November 15, 2025

మల్యాలలో వీఓఏల సమావేశం

image

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మల్యాల బ్రాంచ్ పరిధిలోని వివోఏల ప్రత్యేక సమావేశం శనివారం సెర్చ్ కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌జడ్‌బీ బ్రాంచ్ ఏజీఎం శ్రీలత మాట్లాడుతూ.. జగిత్యాలలో ఈ నెల 18న రుణమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి బ్యాంకు రుణాలను అందించాలని ఆమె వివోఏలను కోరారు. ఈ కార్యక్రమంలో రాంకుమార్, పాషా, ఏపీఎం దేవరాజం పాల్గొన్నారు.

News November 15, 2025

JGTL: నువ్వులు క్వింటాల్ ధర @9,666

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో శనివారం (15-11-2025) వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2061, కనిష్ఠ ధర రూ.1751, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2055, కనిష్ఠ ధర రూ.1985, వరి ధాన్యం (BPT) ధర రూ.2061, వరి ధాన్యం (HMT) గరిష్ఠ ధర రూ.2160, కనిష్ఠ ధర రూ.2000, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2880, కనిష్ఠ ధర రూ.1950, నువ్వుల ధర రూ.9666గా మార్కెట్ అధికారులు తెలిపారు.