News February 10, 2025

రాప్తాడు వైసీపీలో ముసలం

image

రాప్తాడు వైసీపీలో ముసలం నెలకొంది. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాధవ్ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడంపై తోపుదుర్తి వర్గీయులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఇటీవల ఐదుగురు వైసీపీ నేతలను తోపుదుర్తి సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో తోపుదుర్తిని వ్యతిరేకిస్తూ రామగిరి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కలకలం రేపింది.

Similar News

News December 5, 2025

HNK: సబ్ పోస్ట్ ఆఫీసులకు మంగళం

image

కనీస ట్రాన్సాక్షన్స్ జరగకపోవడంతో హనుమకొండ నగరంలోని 3 సబ్ పోస్టాఫీసులను తరలిస్తున్నారు. హనుమకొండ డివిజన్ పరిధిలోని లష్కర్ బజార్, నయూంనగర్, బాపూజీ నగర్ సబ్ ఆఫీసులను రద్దు చేసి వాటిని ఇతర జిల్లాలకు కేటాయించారు. ఇప్పటికే ట్రాన్సాక్షన్స్ లేని కారణంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు మంగళం పాడారు. తాజాగా 3 సబ్ ఆఫీసులు రద్దు కాగా.. త్వరలోనే హనుమకొండలోని మరో రెండు సబ్ పోస్టాఫీసులు రద్దు కానున్నాయి.

News December 5, 2025

హోమ్ లోన్ EMIపై ఎంత తగ్గుతుందంటే?

image

RBI రెపో రేటును తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతమిచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ తగ్గింపుతో బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తాయంటున్నారు. ఫలితంగా గృహ, వాహన రుణాలపై నెలవారీ ఈఎంఐలు తగ్గి రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్న వారికి నెలకు దాదాపు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు భారం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

News December 5, 2025

కామారెడ్డి: తొలి విడత.. ఆ మండలాల్లో మద్యం బంద్

image

కామారెడ్డి జిల్లాలో జీపీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ DEC 11న జరగనుంది. భిక్కనూర్, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి సహా 10 మండలాల్లో (కామారెడ్డి మున్సిపాలిటీ మినహా) మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. DEC 9న సా.5 గంటల నుంచి, పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే DEC 11వరకు కల్లు దుకాణాలు, వైన్ షాపులు, బార్‌లు మూసి ఉంచాలని పేర్కొన్నారు.