News February 10, 2025
రాప్తాడు వైసీపీలో ముసలం

రాప్తాడు వైసీపీలో ముసలం నెలకొంది. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాధవ్ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్గా తిరగడంపై తోపుదుర్తి వర్గీయులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఇటీవల ఐదుగురు వైసీపీ నేతలను తోపుదుర్తి సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో తోపుదుర్తిని వ్యతిరేకిస్తూ రామగిరి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం కలకలం రేపింది.
Similar News
News November 16, 2025
నాగారం: కారు ఢీ.. కానిస్టేబుల్ దుర్మరణం

నాగారం మండలంలో అతివేగంతో వచ్చిన<<18299567>> కారు ఢీకొనడంతో<<>> కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సీఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం… పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి ముగ్గురిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ కమలాకర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడ్డ మరో ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News November 16, 2025
సఖినేటిపల్లి: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేపలు

సఖినేటిపల్లి (M) అంతర్వేది తీరంలో మత్స్యకారుల వలలకు శనివారం అరుదైన చేపలు చిక్కాయి. అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో జరిగిన వేలంలో వీటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. ప్రధానంగా 13 గోల్డ్ ఫిష్ (కచ్చిడి) చేపలు ఏకంగా రూ.52 వేలు పలకడం విశేషం. ఇక మార్కెట్లో కోనాం కిలో రూ.600, కవర్లు రూ.70, బోంబేడెక్ రూ.65 చొప్పున ధర పలికాయి. మంచి ధర దక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
News November 16, 2025
జనగామ: యాక్సిడెంట్.. మార్చురీలో మృతదేహాలు

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో HNK-HYD జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో <<18300916>>ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే<<>>. హన్మకొండ జిల్లా బాలసముద్రం ప్రాంతానికి చెందిన నవజీత్ సింగ్, హైదరాబాద్ దోమలగూడకు చెందిన పూలమాటి ఓం ప్రకాశ్ మృతి చెందారు. వీరి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రిలో ఉంచారు.


