News October 22, 2024

రాబోవు నాలుగు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో రానున్న నాలుగు రోజులలో కురువనున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు నిండుగా ప్రవహించే అవకాశం ఉందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జాగ్రత్తలు చేపట్టాలని, కర్ణాటకలోని పరగోడు నిండి పొర్లుతున్నందున చిలమత్తూరు, గోరంట్ల, పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News December 1, 2025

ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి కేశవ్

image

ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉరవకొండ మండలం బూదిగవి గ్రామ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. గంటపాటు విద్యార్థులకు పాఠం చెప్పారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం ఇచ్చారు. విద్యార్థుల తెలివితేటలను చూసిన మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలలో అధిరోహించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.

News December 1, 2025

నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి

image

ఉరవకొండ మండలం బూదిగవిలో రూ.43.75 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.

News November 30, 2025

2,81,298 మందికి పెన్షన్ పంపిణీ పంపిణీకి సిద్ధం: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో 2,81,298 మంది NTR భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు రూ.125.39 కోట్లు పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 6:30 గంటలకు పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగస్థులు పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ పంపిణీ విధానాన్ని DLDO, MPDO, మున్సిపల్ కమిషనర్లు పరిరక్షించాలని ఆదేశించారు.