News February 8, 2025

రామంతపూర్‌లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

ఉప్పల్ PS పరిధి రామంతపూర్‌లోని ఇందిరానగర్‌లో పదో తరగతి విద్యార్థిని(15) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గాంధీనగర్‌లోని ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అనంతరం ఇంటికి వచ్చాక తల్లి బయటకు వెళ్లింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 9, 2025

హనుమాన్ చాలీసా భావం – 33

image

తుమ్హరే భజన రామ కో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై ||
హనుమంతుడు శ్రీరాముడి పరమభక్తుడు. అందుకే ఆంజనేయస్వామిని భజిస్తే రాముడిని చేరుకోనే మార్గం సుగగమవుతుందని పండితులు చెబుతారు. హనుమాన్ భజన ఫలితంగా జన్మ జన్మలలోని దుఃఖాలన్నీ పోతాయని భావిస్తారు. మారుతీ నామ పఠనం మనకు భయాలు, దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆత్మ స్థైర్యం, ధైర్యాన్ని పెంచుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 9, 2025

కడప మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

image

కడప నగర మేయర్ ఎన్నికకు సంబంధించి ఈనెల 11వ తేదీన ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అయితే ఈ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వం ఈ ఎన్నికను సక్రమంగా నిర్వహించడం లేదంటూ ఎన్నిక చల్లదంటూ వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎన్నిక నిర్వహణపై ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఈ ఎన్నిక నిర్వహణపై తీర్పును రేపు ఉదయానికి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.

News December 9, 2025

చిత్తూరు: 12న అంగన్వాడీల ఆందోళన

image

అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12వ తేదీ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని యూనియన్ లీడర్ సరస్వతి తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పులిచెర్లలో సీడీపీవోకు అందజేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పథకాలు అమలు చేయాలని, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు, జీతాలు పెంచాలని, మెడికల్ లీవ్ ఇవ్వాలని, పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని కోరారు.