News March 22, 2025

రామకృష్ణాపూర్‌లో శ్రీకాంత్ సూసైడ్.. UPDATE

image

రామకృష్ణాపూర్‌లో <<15839741>>శ్రీకాంత్ <<>>ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ రాజశేఖర్ వివరాలు.. పట్టణానికి చెందిన శ్రీకాంత్ ఓ కన్స్‌స్ట్రక్షన్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, కంపెనీలోని ఆర్థిక లావాదేవీలలో ముగ్గురు తనను వేధిస్తున్నారంటూ సూసైట్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. శుక్రవారం కుటుంబ సభ్యులు తలుపు తెరచి చూడగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదైంది.

Similar News

News November 26, 2025

రాజోలు: పల్లె పండుగ 2.0లో ఉపముఖ్యమంత్రి పవన్ క

image

రాజోలు మండలం శివకోడులో కలెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో ‘పల్లె పండుగ 2.0’ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘పల్లె పండుగ 1.0’ అభివృద్ధి పనుల ఫోటో గ్యాలరీని ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

News November 26, 2025

ములుగు: సర్పంచ్ నేనే.. నాకు కన్ఫర్మ్ అయ్యింది!

image

ములుగు జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కాగా, పోటీలో ఉన్న అభ్యర్థులు టికెట్ వస్తుంది.. నన్ను కన్ఫామ్ చేశారంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి వారే నేనే సర్పంచ్ అంటే.. నేనే సర్పంచ్ అంటూ గ్రామాల్లో గప్పాలు కొడుతుండటంతో ఓటర్లు తికమక పడుతున్నారు.

News November 26, 2025

ట్యాంక్‌బండ్ వద్ద ఆందోళన.. ట్రాఫిక్ జామ్

image

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GO 46ను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ నాయకులు ట్యాంక్‌బండ్‌పై ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్లలో భాగంగా కొన్ని మండలాల్లో బీసీలకు పంచాయతీలు రిజర్వ్ కాలేదన్నారు. రాస్తారోకో చేపట్టడంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు.