News April 11, 2025
రామగిరి ఎస్ఐ దాచింది.. దోచింది ఎక్కువే: వైసీపీ

రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్పై వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ‘ఆయనను చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి సస్పెండ్ అయిన సుధాకర్ తెలుగుదేశం కార్యకర్త కన్నా ఎక్కువ ఉత్సాహంగా పార్టీ కోసం పని చేస్తున్నారని అంటున్నారు. పరిటాల సునీత అండతో అరాచక శక్తిగా ఎదిగిన సుధాకర్ దాచింది.. దోచింది ఎక్కువే అని చర్చలు నడుస్తున్నాయి’ అంటూ ట్వీట్ చేసింది.
Similar News
News April 19, 2026
పీజీఆర్ఎస్ కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
News April 19, 2026
పీజీఆర్ఎస్ కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
News April 19, 2026
అనంతపురం జిల్లాలో ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఇంటర్ ఫలితాల్లో అనంతపురం జిల్లా రాష్ట్రంలో ఫస్టియర్ ఫలితాల్లో 15వ స్థానం, సెకండియర్లో 78 శాతం ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. ఫస్టియర్లో 22,367 మందికి 15,814 మంది పాసయ్యారు. సెకండియర్లో 20,778 మందికి 15,530 మంది పాసయ్యారు. సెకండియర్కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితో పాటు పాసైన వారూ మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు ఉంటాయి.


