News February 19, 2025

రామగుండంలో చర్చలు విఫలం

image

రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ సమక్షంలో రామగుండం రీజియన్‌లోని ఓబీ కంపెనీల కాంట్రాక్టర్లకు, కాంట్రాక్టు కార్మికులకు మధ్యన జరిగిన చర్చలు వాయిదా పడ్డాయి. వేతనాలు కనీసం రూ.6 వేలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేయగా రూ.2 వేలు పెంచుతామని కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. కాగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కార్మికులకు కనీసం రూ.4 వేలు పెంచాలని ఎమ్మెల్యే సూచించారు.

Similar News

News November 17, 2025

జిన్నింగ్ మిల్లుల బంద్‌.. రైతుల ఆవేదన!

image

TG: CCI విధానాలను వ్యతిరేకిస్తూ కాటన్ మిల్లర్లు నిరసనకు దిగారు. L1, L2 కేటగిరీలను ఎత్తివేయాలంటూ నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్‌ చేపట్టారు. దీంతో రైతులపై మరో పిడుగు పడినట్లయింది. ఇప్పటికే ‘కపాస్’ యాప్‌లో స్లాట్ బుకింగ్, ఎకరాకు 7 క్వింటాళ్లే కొనుగోలు, తేమ 8-12% మించొద్దన్న నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. వానలు తగ్గడంతో తేమ సమస్య ఉండదనుకుంటే బంద్‌తో కొనుగోళ్లు ఆగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

News November 17, 2025

వచ్చే ఏడాది నా పెళ్లి: సాయి దుర్గ తేజ్

image

టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచి సినిమాలు, గొప్ప జీవితం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపేందుకే తిరుమల వచ్చానన్నారు. పెళ్లిపై ఓ జర్నలిస్టు ప్రశ్నించగా ‘వచ్చే ఏడాదిలోనే నా వివాహం ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ‘సంబరాల ఏటిగట్టు’ అనే మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇది వచ్చే సంవత్సరం విడుదల కానుంది.

News November 17, 2025

అలంపూర్ జోగులాంబ ఆలయంలో నేడు దీపోత్సవం

image

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం కావడం తుంగభద్ర పుష్కర్ ఘాటు దగ్గర సామూహిక దీపోత్సవం నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఐదు వేల ప్రమిదలతో దీపాలు వెలిగించనున్నారు. భక్తులకు ఉచితంగా ప్రమిదలు, కుంకుమ, పసుపు, గాజులు ఇవ్వనున్నట్లు దేవస్థానం ఈవో దీప్తి తెలిపారు‌. దీపోత్సవం తర్వాత స్వామివారి రథోత్సవం జరుగుతుంది.