News January 28, 2025
రామగుండంలో 2400 MW కొత్త ప్రాజెక్టుకు ప్రజాభిప్రాయ సేకరణ నేడు

రామగుండం NTPCలో కొత్తగా 2400 MW విద్యుత్తు ప్లాంటు నిర్మాణం కోసం నేడు<<15285274>> ప్రజాభిప్రాయ సేకరణ<<>> చేయనున్నారు. కార్పొరేషన్లోని కుందనపల్లి, రాణాపూర్, రామగుండం తదితర ప్రాంతాల్లోని స్థలాన్ని సేకరించనున్నారు. కొత్త విద్యుత్తు ప్రాజెక్టులో ప్రభావిత ప్రాంతాల్లోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పలు పార్టీల నాయకులు కోరుతున్నారు. RGMలో కొత్త థర్మల్ ప్రాజెక్టుపై మీ కామెంట్?
Similar News
News November 24, 2025
HYD: సర్కార్ దవాఖానాలకు ‘మందుల’ సుస్తి

నగరంలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అత్యవసర మందుల కోసం అవస్థలు పడుతున్నాయి. పేట్ల బురుజు, నీలోఫర్, MNJ క్యాన్సర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు అత్యవసర రోగులకు మందులు అందించలేక పోతున్నాయి. నిధుల కొరతతో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల నిధులు జాప్యంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.
News November 24, 2025
UCIL 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News November 24, 2025
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.


