News March 27, 2025
రామగుండం: ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందండి: అదనపు కలెక్టర్

ఈనెల 31 లోగా బకాయిలతో సహా ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లిస్తే 90% వడ్డీ మినహాయింపు పొందే అవకాశం ఉందని జిల్లా అదనపు కలెక్టర్& రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అరుణ శ్రీ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మార్చి 31(2025) నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిలు అన్నింటినీ ఒకేసారి చెల్లిస్తే రాయితీ పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 18, 2025
MNCL: ఛత్తీస్గఢ్ వెళ్లి దొంగను అరెస్ట్ చేశారు

కోర్టుకు గైర్హాజర్ అవుతున్న వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. టూ టౌన్ ఎస్సై మహేందర్ కేసు వివరాలు వెల్లడించారు. దొంగతనం కేసులో కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న హరదీప్ సింగ్ను ఛత్తీస్గఢ్లో పట్టుకొని బెల్లంపల్లి తీసుకొచ్చారు. జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా జైలు శిక్ష విధించారు. అనంతరం ఆసిఫాబాద్ జైలుకు తరలించారు.
News April 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 18, 2025
గద్వాల జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

పంట పండించే ఏ రైతు నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్పై ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలోకి నకిలీ విత్తనాలు రావడం గానీ, వినియోగం కానీ జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరాలపై రివ్యూ సమావేశం పోలీస్ అధికారులతో నిర్వహించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడాలన్నారు.