News January 26, 2025
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27న ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు పోలీస్ యాక్ట్ ఆమలులో వుంటుందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చు చేస్తున్నా..: JP

మన దేశంలో డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానమని, 90% సర్టిఫికెట్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని జయప్రకాశ్ నారాయణ ఓ ప్రోగ్రాంలో అన్నారు. స్కిల్ లేకుండా పట్టాలు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్ష ఖర్చు చేస్తున్నా కనీస విద్యాప్రమాణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో పాసైన వారిలో 20% విద్యార్థులకే సబ్జెక్టుల్లో మినిమమ్ నాలెడ్జ్ ఉంటుందని తెలిపారు.
News December 1, 2025
అమరావతికి మహర్దశ..16,666 ఎకరాల్లో మెగా ప్లాన్.!

రాజధాని అమరావతి దశ తిరగనుంది. ఏకంగా 16,666 ఎకరాల్లో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. అమరావతిని నెక్ట్స్ జనరేషన్ గ్రోత్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అంతర్జాతీయ స్థాయి ‘గ్లోబల్ స్పోర్ట్స్ సిటీ’, కొత్త రైల్వే నెట్వర్క్ ఏర్పాటు, భారీ సాగునీటి ప్రాజెక్టులకు ఊతం. కనెక్టివిటీ, క్రీడలు, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేస్తూ, అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ఈ ప్లాన్ లక్ష్యం.
News December 1, 2025
ఐటీ జాబ్ వదిలి.. ఆవులతో రూ.2 కోట్ల టర్నోవర్!

పని ఒత్తిడితో రూ.లక్షల జీతం వచ్చే IT కొలువు కన్నా, గోవుల పెంపకమే మేలనుకున్నారు అహ్మదాబాద్కు చెందిన శ్రీకాంత్ మాల్డే, చార్మి దంపతులు. జాబ్ వదిలి, 2014లో 4 ఆవులను కొని వాటి పాలు, పేడతో ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేసి అమ్మారు. కల్తీలేని గోఉత్పత్తులకు డిమాండ్ పెరగ్గా మరిన్ని ఆవులను కొన్నారు. కట్ చేస్తే 2024 నాటికి రూ.2 కోట్ల టర్నోవర్ సాధించారు. వారి సక్సెస్కు కారణాల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


