News January 26, 2025
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27న ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు పోలీస్ యాక్ట్ ఆమలులో వుంటుందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు.
Similar News
News March 2, 2026
SKLM: ఇంటర్ పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 71 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో జనరల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 11,551 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,164 మంది రాశారు. ఒకేషనల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 1,510 మందికి గాను 1,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు.
News March 2, 2026
భూపాలపల్లి: ప్రజావాణిలో 65 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 65 దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ఆయా దరఖాస్తులను అధికారులు జాప్యం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 2, 2026
కలెక్టర్ జితేష్ పాటిల్కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు

టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీగా బదిలీ అయిన భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్కు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన భార్యకు రెండో కాన్పు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించి, సామాన్యులకు సర్కారు వైద్యంపై నమ్మకం కలిగించిన ఆయన సేవలు మరువలేమని, ఆయన బదిలీ జిల్లాకు తీరని లోటని వక్తలు పేర్కొన్నారు.


