News February 1, 2025

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో Mar-1 వరకు నిషేధాజ్ఞలు

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాల్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డీజే, డ్రోన్ కెమెరాల పై నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు మార్చి 1 వరకు కొనసాగుతాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గొడవలకు పాల్పడితే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Similar News

News October 19, 2025

ప్రమాదం జరిగితే ఇలా చేయండి: ప్రకాశం SP

image

ప్రకాశం జిల్లా ప్రజలకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దీపావళి రోజు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 101కు సమాచారం అందించాలన్నారు. అలాగే పోలీస్ డయల్ 100, 112 నెంబర్లను సైతం సంప్రదించవచ్చని తెలిపారు. కాలుష్య రహిత టపాసులను ప్రజలు కాల్చాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

News October 19, 2025

దీపావళి ఉత్సవాలు.. ఇవి గుర్తుంచుకోండి

image

*లైసెన్స్ పొందిన షాప్స్ నుంచే బాణసంచా కొనాలి.
*టపాకాయలు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలి. సింథటిక్ లేదా లూజ్ వస్త్రాలు ధరించవద్దు.
*పని చేయని పటాకులను మళ్లీ వెలిగించేందుకు ట్రై చేయవద్దు.
*క్రాకర్స్ వల్ల గాయమైతే ఐస్, వెన్న, ఆయింట్‌మెంట్ రాయవద్దు. 10-15 ని. పాటు శుభ్రమైన నీటితో చల్లగా ఉంచాలి.
*అత్యవసర సమయాల్లో 101 లేదా 112కి కాల్ చేయాలి.

News October 19, 2025

విజయవాడ: పర్యాటకులకు గుడ్ న్యూస్

image

విజయవాడ భవాని ఐలాండ్‌లో ఆదివారం నుంచి బోటు షికారు తిరిగి ప్రారంభమైంది. గత 60 రోజులుగా ఎగువ నుంచి కురుస్తున్న వర్షాల ఉధృతి, వర్షాల కారణంగా కృష్ణా నదిలో బోటు షికారు నిలిచిపోయింది. ఆదివారం బోటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో టూరిస్టులు బోటు షికారుకు ఆసక్తి చూపారు. కాగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ నిర్వహణ జరుగుతోంది.