News February 17, 2025

రామగుండం: ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

image

రామగుండం పోలీస్ కమిషనర్ ప్రధాన కార్యాలయంలో సోమవారం సీపీ ఎం.శ్రీనివాస్ నేరుగా ఫిర్యాదుదారుల వద్దకు వచ్చి వారి సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను స్వీకరించి వాటిని సంబంధిత స్టేషన్ల సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య పరిష్కారానికి సూచనలు చేశారు. 

Similar News

News November 18, 2025

వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

image

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

News November 18, 2025

వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

image

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

News November 18, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ 7.8, న్యాల్‌కల్ 8.2, సదాశివపేట 8.4,మెదక్ జిల్లా నర్లాపూర్ 9.5, దామరంచ 9.9, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6,పోతారెడ్డిపేట 9.2, కొండపాక 9.7డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు,బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.