News February 22, 2025
రామగుండం: యువకుడిపై కత్తితో ట్రాన్స్జెండర్ దాడి

రామగుండంకు చెందిన బాధితుడు బాదావత్ మోహన్ కొన్ని నెలల నుంచి ఖమ్మం జిల్లాలోని పెద్దతండాలో చికెన్ షాప్లో పనిచేస్తున్నాడు. ఇక్కడ ట్రాన్స్జెండర్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాత్రి ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడటంతో కోపోద్రిక్తంలో ట్రాన్స్ జెండర్, మోహన్ను కత్తితో ఐదు చోట్ల పొడిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ట్రాన్స్జెండర్ పరారీలో ఉంది.
Similar News
News December 5, 2025
కోదాడ: భర్త వార్డు సభ్యుడిగా.. భార్య సర్పంచ్గా పోటీ..!

కోదాడ పరిధి అనంతగిరి మండలం అమినాబాద్లో భార్యాభర్తలు ఇద్దరూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. భర్త చిలకమూడి శ్రీనివాసరావు వార్డు సభ్యుడిగా పోటీలో ఉండగా సర్పంచ్ స్థానం మహిళకు రిజర్వ్డ్ కావడంతో ఆయన భార్య సంధ్యారాణిని బరిలో నిలిపారు. కాగా వారికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోంది. శ్రీనివాసరావు గతంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్గా పనిచేశారు. దంపతులు ఇరువురు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News December 5, 2025
కేఎల్యూలో నేడు ‘ఉద్భవ్-2025’ ముగింపు సంబరాలు

వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయ ఏకలవ్య సాంస్కృతిక ఉత్సవాలు ‘ఉద్భవ్-2025’ నేటితో ముగియనున్నాయి. గిరిజన సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ముగింపు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి అతిథులుగా హాజరవుతారు. గిరిజన విద్యార్థుల కళా ప్రదర్శనల అనంతరం, చేతులకు బహుమతులు అందించనున్నారు.
News December 5, 2025
నల్గొండ: ఏపీ సీఎంను కలువనున్న మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలవనున్నారు. అమరావతి, క్యాంపు కార్యాలయంలో బాబును కలిసి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8, 9వ తేదీల్లో నిర్వహించ తలపెట్టిన రైసింగ్ తెలంగాణ-విజన్ 2047, గ్లోబల్ సమ్మిట్కు హాజరుకావాలని ఆహ్వానించనున్నారు.


