News February 22, 2025

రామగుండం: యువకుడిపై కత్తితో ట్రాన్స్‌జెండర్ దాడి

image

రామగుండంకు చెందిన బాధితుడు బాదావత్ మోహన్ కొన్ని నెలల నుంచి ఖమ్మం జిల్లాలోని పెద్దతండాలో చికెన్ షాప్‌లో పనిచేస్తున్నాడు. ఇక్కడ ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాత్రి ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడటంతో కోపోద్రిక్తంలో ట్రాన్స్ జెండర్, మోహన్‌ను కత్తితో ఐదు చోట్ల పొడిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ట్రాన్స్‌జెండర్ పరారీలో ఉంది.

Similar News

News February 25, 2026

మోదీ ఇజ్రాయెల్ ట్రిప్‌పై రాహుల్ విమర్శలు

image

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. USతో ట్రేడ్ డీల్ క్యాన్సిల్ చేసుకోమని తాను సవాల్ విసిరి 24 గంటలకుపైనే అయిందని.. దీనిపై స్పందించకుండా సైలెంట్‌గా మోదీ ఇజ్రాయెల్ వెళ్లిపోయారని విమర్శించారు. గతంలో ఓసారి ఎప్‌స్టీన్ ఆదేశాలతో ఇజ్రాయెల్‌‌లో పర్యటించారని.. ఇప్పుడు ఎవరి ఆదేశాలతో మళ్లీ వెళ్లారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నరేంద్ర ‘సరెండర్’ మోదీ అంటూ PMని విమర్శించారు.

News February 25, 2026

మహబూబాబాద్ బస్టాండ్‌లో భారీ చోరి

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్‌లో భారీ చోరీ జరిగింది. బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికుడి ప్యాంట్ జేబులో నుంచి రూ.7 లక్షల విలువైన 41/2 తులాల బంగారు, 3 తులాల వెండి ఆభరణాలు గల బ్యాగును దుండగులు అపహరించారని బాధితులు వాపోయారు. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్-మంజుల దంపతులు మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తుండగా దొంగలు దోచుకుపోయారు.

News February 25, 2026

తిరిగి జట్టులో చేరనున్న రింకూ సింగ్!

image

T20 WC: తండ్రికి అనారోగ్యం నేపథ్యంలో చెన్నై క్యాంప్ నుంచి రింకూ సింగ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు జింబాబ్వేతో మ్యాచ్ నేపథ్యంలో ఇవాళ అతడు తిరిగి భారత జట్టులో చేరతారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. అయితే రింకూ తుది జట్టులో ఉంటారా, లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. WCలో ఇప్పటిదాకా అతడు ఆడిన 5 మ్యాచుల్లో 24 రన్స్ మాత్రమే చేయడం గమనార్హం.