News February 12, 2025
రామగుండం: వారం వ్యవధిలో తనువు చాలించిన భార్యాభర్తలు

తనువు ఆ తర్వాత మనువు తో కలిసిన ఆ బంధం కట్టే కాలే వరకు కొనసాగింది. 4 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు తనువు చాలించిన సంఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది. స్థానిక బాపూజీ నగర్కు చెందిన ఆకునూరి లక్ష్మి ఈనెల 2న మరణించగా 4 రోజుల వ్యవధిలో భర్త ఆకునూరి దుర్గయ్య తనువు చాలించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన కుటుంబం లో విషాదాన్ని మిగిల్చింది.
Similar News
News February 24, 2026
రాజకీయాల్లోకి వస్తా : దేవ్ జీ

అజ్ఞాతం వీడిన తాను త్వరలోనే రాజకీయాల్లో వస్తానని మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ వెల్లడించారు. మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయన తాను ఏ పార్టీలో చేరుతానో ఇప్పటికిప్పుడే చెప్పలేనన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సరైన వేదిక కాదన్న ఆయన త్వరలోనే పార్టీ జీవితంపై ప్రకటన చేస్తానన్నారు. అనారోగ్య కారణంతోనే తాను అజ్ఞాతం వీడానని, వ్యక్తిగత జీవితం కొనసాగించడం కోసం కాదని స్పష్టం చేశారు.
News February 24, 2026
గణపతి అడవిలో లేరు: డీజీపీ

మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి మంగళవారం DGP శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. DGP మాట్లాడుతూ.. రెండేళ్లలో 591మంది మావోయిస్టులు లొంగిపోయారని, ప్రస్తుతం అగ్రనేత గణపతి అడవుల్లో లేరని, బయట ఎక్కడో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం ఉందని వెల్లడించారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న 11 మంది TG నేతల్లో కొందరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు.
News February 24, 2026
కీరదోసలో పండు ఈగ – నివారణ

కీరదోసను ఆశించే పండు ఈగలు పువ్వు మొగ్గలపై, లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన సన్నని పిల్ల పురుగులు కాయను తొలచి, లోపలి గుజ్జును తిని నష్టపరుస్తాయి. దీని వల్ల కాయలు కుళ్లిపోయి దిగుబడి తగ్గిపోతుంది. వీటి నివారణకు లీటరు నీటికి మలాథియాన్ 2ml (లేదా) ప్రొఫెనోఫాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగులను నివారించడానికి విషపు ఎరలను తయారు చేసుకోవాలి.


