News February 12, 2025

రామగుండం: వారం వ్యవధిలో తనువు చాలించిన భార్యాభర్తలు

image

తనువు ఆ తర్వాత మనువు తో కలిసిన ఆ బంధం కట్టే కాలే వరకు కొనసాగింది. 4 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు తనువు చాలించిన సంఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది. స్థానిక బాపూజీ నగర్కు చెందిన ఆకునూరి లక్ష్మి ఈనెల 2న మరణించగా 4 రోజుల వ్యవధిలో భర్త ఆకునూరి దుర్గయ్య తనువు చాలించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన కుటుంబం లో విషాదాన్ని మిగిల్చింది.

Similar News

News February 23, 2026

HYD: అమ్మాయిలూ జాగ్రత్త.. సజ్జనార్ వార్నింగ్

image

హైదరాబాద్‌లో పెళ్లిచూపులు, నిశ్చితార్థం పేరుతో జరుగుతున్న మోసాలపై యువతులను ట్విటర్ వేదికగా సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నిశ్చితార్థం తర్వాత చనువు పెంచుకుని, శారీరకంగా లోబరుచుకుని, ఆపై అదనపు కట్నం కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని CP పేర్కొన్నారు. పరువు పోతుందన్న భయంతో మౌనంగా ఉండవద్దని, ఇలాంటి వేధింపులు ఎదురైతే వెంటనే షీ టీమ్స్(9490616555) లేదా డయల్ 100ను సంప్రదించాలని సూచించారు.

News February 23, 2026

రాజమండ్రిలో కల్తీ పాలు.. సీఎం సమీక్ష

image

AP: రాజమండ్రిలో <<19213441>>కల్తీ పాల వ్యవహారంపై<<>> సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలువురు అస్వస్థతకు గురవడం, మరణించడంపై వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని, ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్య శాఖ అధికారులు వెంటనే రాజమండ్రి వెళ్లాలని సూచించారు. ల్యాబ్‌లో పాల నమూనాలను పరీక్షించిన తర్వాత ఫలితాలను బట్టి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 23, 2026

వంటింటి చిట్కాలు

image

* ఫ్రిడ్జ్‌లో వాసన వస్తుంటే.. ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది. * బంగాళదుంప ముక్కలను మజ్జిగలో నానబెట్టి ఫ్రై చేస్తే అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి. * దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, కందిపప్పు, స్పూను చొప్పున మెంతులు, అటుకులు వేయాలి. * ఫర్నిచర్, వంట పాత్రలపై ఉండే స్టిక్కర్లను తీయడానికి దాని మీద నూనె వేసి రుద్ది, పావుగంటయ్యాక సబ్బుతో కడగాలి.