News February 22, 2025
రామగుండం: సర్వేలో పూర్తి వివరాలు అందించండి: అదనపు కలెక్టర్

గతంలో జరిగిన కుటుంబ, సామాజిక సర్వేలో వివరాలు అందించని కుటుంబాలు తిరిగి ఈనెల 16 నుంచి 28 వరకు పూర్తి వివరాలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్& రామగుండం కార్పొరేషన్ ఇంచార్జీ కమిషనర్ అరుణశ్రీ ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు సర్వే దరఖాస్తులు తీసుకొని పూర్తిచేసి అందించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News September 14, 2025
VJA: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం అప్డేట్

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరువురు వ్యక్తులు దుర్మరణం చెందినట్లు గూడూరు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తులు విజయవాడ శివారు తాడిగడపకు చెందిన ఆదాం బాబు, షరీన్గా పోలీసులు గుర్తించారు. వీరు ద్విచక్ర వాహనంపై మచిలీపట్నం బీచ్కి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్పారు.
News September 14, 2025
సృష్టి కేసులో విశాఖలో సిట్ తనిఖీలు

తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సృష్టి కేసులో విశాఖలోని 2 చోట్ల సిట్ అధికారులు, తెలంగాణ సిట్ బృందం
తనిఖీలు చేపట్టారు. నగరంలోని సృష్టి కార్యాలయం, ఆసుపత్రిలో రాత్రి 12:00 వరకు తనిఖీలు కొనసాగాయి. జిల్లా వైద్య అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించి తనిఖీలు చేపట్టగా విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కేజీహెచ్ డాక్టర్లు ముగ్గురు సస్పెండ్ కాగా మిగతావారి పాత్ర తేలాల్సి ఉంది.
News September 14, 2025
అమరావతిలో NTR విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధం

అమరావతి రాజధాని లో NTR విగ్రహం, ఐకానిక్ వంతెన నిర్మాణంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే NTR స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని ఉద్దేశం చేశారు. శనివారం ఉండవల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం నమూనాలను సీఎం పరిశీలించారు. అమరావతిలో నీరుకొండ వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు.