News February 22, 2025
రామగుండం: సర్వేలో పూర్తి వివరాలు అందించండి: అదనపు కలెక్టర్

గతంలో జరిగిన కుటుంబ, సామాజిక సర్వేలో వివరాలు అందించని కుటుంబాలు తిరిగి ఈనెల 16 నుంచి 28 వరకు పూర్తి వివరాలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్& రామగుండం కార్పొరేషన్ ఇంచార్జీ కమిషనర్ అరుణశ్రీ ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు సర్వే దరఖాస్తులు తీసుకొని పూర్తిచేసి అందించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 2, 2025
క్రైస్తవ సేవా/ ప్రతిభ అవార్డులకు DEC 6 LAST DATE

సామాజిక, విద్యా, వైద్య, సాహిత్యం, కళా, క్రీడా వంటి రంగాల్లో విశిష్ట సేవలు లేదా ప్రతిభ కనబరిచిన క్రైస్తవ వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందించనున్నట్లు PDPL జిల్లా ఇన్ఛార్జ్ మైనారిటీల సంక్షేమ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. 30 ఏళ్లు పైబడిన వ్యక్తులు లేదా ఉత్తమ సేవా సంస్థలు DEC 6 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి. నామినేషన్ ఫారాలు www.tscmfc.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
News December 2, 2025
హైదరాబాద్లో అజయ్ దేవ్గన్ ఫిల్మ్ సిటీ!

TG: రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు’ వేదిక కానుంది. HYDలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంతో MOU కుదుర్చుకోనున్నారు. అలాగే నైట్ సఫారీ ఏర్పాటుకు రిలయన్స్కు చెందిన వనతార యానిమల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ ముందుకొచ్చింది. ఫుడ్లింక్ F&B హోల్డింగ్స్ కంపెనీ రూ.3వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో 3 హోటళ్లు నిర్మాణానికి ఒప్పందం చేసుకోనుంది.
News December 2, 2025
భారత్పై పాక్ మీడియా అసత్య ప్రచారం

తుఫానుతో నష్టపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు గగనతల అనుమతులివ్వాలని సోమవారం 1PMకు పాక్ కోరగా 4గంటల్లోనే IND ఒప్పుకుంది. అయితే పర్మిషన్ ఇవ్వలేదని పాక్ మీడియా ప్రచారం చేయడాన్ని భారత్ ఖండించింది. మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చామని, PAK మీడియా నివేదికలు బాధ్యత రాహిత్యమైనవని పేర్కొంది. గగనతల అనుమతుల విషయంలో సాంకేతిక, భద్రతా అంచనాలనే IND పరిగణనలోకి తీసుకుంటుందని, రాజకీయ కోణంలో నిరాకరణ ఉండదని చెప్పింది.


