News February 10, 2025

రామగుండం: హెల్మెట్ ఉంటేనే పెట్రోల్

image

బైకులు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రామగుండం ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ మేరకు పారిశ్రామిక ప్రాంతంలోని పెట్రోల్ బంకుల వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. దానిపై ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వస్తేనే.. పెట్రోలు పోస్తామని బోర్డు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు రూల్స్ పాటించాలని ట్రాఫిక్ CI రాజేశ్వర్ రావు సూచిస్తున్నారు.

Similar News

News February 24, 2026

నిర్మల్: పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హైదరాబాద్ నుంచి, ఇంటర్మీడియట్, పదవతరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలిసి, అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.

News February 24, 2026

నిర్మల్: ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున విస్తృత స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మొత్తం 23 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు.

News February 24, 2026

ఈ అలవాట్లతో డేంజర్!

image

జీవనశైలిలో చేసే కొన్ని పొరపాట్లు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘6 గంటల కంటే తక్కువ నిద్ర, గంటల తరబడి కూర్చోవడం, రాత్రిపూట ఫోన్ వాడటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గి డిమెన్షియా ముప్పు పెరుగుతుంది. వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, BP/షుగర్ కంట్రోల్‌లో లేకపోతే మెదడు కణాలు దెబ్బతింటాయి. గురకను నిర్లక్ష్యం చేస్తే స్ట్రోక్ రావొచ్చు. వీటి వల్ల మెదడు వయసు పెరుగుతుంది’ అని చెబుతున్నారు.