News March 21, 2025
రామచంద్రపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఆర్సీపురంలో ఘోర రోడ్డు ప్రమాద సంఘటన రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎలక్ట్రికల్ వెహికల్ ను ఆర్ఎంసి వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తున్న సాదు రవితేజ (36) తలపై నుంచి వాహనం పోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 15, 2025
రామాయణంలోని ముఖ్య ఘట్టంతో ‘వారణాసి’: రాజమౌళి

మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి SS రాజమౌళి కీలక విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అస్సలు అనుకోలేదు. కానీ ఒక్కొక్క డైలాగ్, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదు, గాల్లో ఉన్నానని అనిపించింది’ అని అన్నారు. మహేశ్కు రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే గూస్బంప్స్ వచ్చాయని తెలిపారు.
News November 15, 2025
జనగామ: 17 నుంచి పత్తి కొనుగోళ్ల నిలిపివేత

తెలంగాణ రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపు మేరకు ఈనెల 17 నుంచి జనగామ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ పత్తి కొనుగోళ్లు, ప్రైవేటు పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివరాజ్ తెలిపారు. కావున.. రైతులు మార్కెట్కు, జిన్నింగ్ మిల్లులకు పత్తిని తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు.
News November 15, 2025
NTR: వైసీపీలోకి రంగా వారసురాలు..?

దివంగత నేత వంగవీటి రంగా కుమార్తె ఆశ కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. రేపు ఉదయం బందర్ రోడ్డులోని రంగా విగ్రహానికి నివాళులర్పించి కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రంగా కుమార్తె ఆశ కిరణ్ అన్నది కూడా చాలా మందికి తెలియదు. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమె వంగవీటి రాధా ఉన్న పార్టీలో కాకుండా మరో పార్టీలో చేరే అవకాశం ఉందని, YCPలో చేరే ఛాన్స్ ఉందని చర్చ నడుస్తోంది.


