News March 23, 2025
రామచంద్రపురం: కేజీ చికెన్ ఎంతంటే?

రామచంద్రపురం మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.130, బాయిలర్ కేజీ రూ. 200, ఫారం కేజీ రూ.స్కిన్ లెస్ (బాయిలర్) కేజీ రూ.240కి విక్రయిస్తున్నట్లు చోడవరం బైపాస్ వద్ద చికెన్ అమ్మకదారులు తెలిపారు. ఆదివారం అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయాలు చేస్తున్నామని వారు చెప్పారు. మరి మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి.
Similar News
News October 21, 2025
సిద్దిపేట: జన సేవలో ఎస్సై జాన్ విల్సన్

విధి నిర్వహణలో ప్రాణాలర్పించి జనం హృదయాల్లో నిలిచారు SI జాన్ విల్సన్. 1991లో రామవరంలో నక్సలైట్ల మందుపాతరకు సీఐ యాదగిరి, జాన్విల్సన్తోపాటు మరో 13 మంది చనిపోయారు. తన పెళ్లి కార్డులు ఇచ్చేందుకు వచ్చి విల్సన్ బలయ్యాడు. ఏడాదిన్నరపాటు హుస్నాబాద్ ఎస్ఐగా పనిచేసి పేదల పక్షపాతిగా, సామాన్యుల గుండెల్లో గూడుకట్టుకున్నారు. జాన్ విల్సన్ పేరిట ట్రస్టులు, బస్టాండ్లు, యూనియన్లు, స్మారక నిర్మాణాలు చేపట్టారు.
News October 21, 2025
NZB: అమరుడా నీకు వందనం

పోలీసులు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో 5 రోజుల క్రితం NZBలో విధి నిర్వహణలో అమరుడైన CCS కానిస్టేబుల్ ప్రమోద్కు పోలీసులతో పాటు జిల్లా ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. నగరంలోని గూపన్పల్లికి చెందిన ప్రమోద్ 2003 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 3 నెలల క్రితం ట్రాఫిక్ విభాగంలో పని చేసిన ఆయన ఇటీవలే CCSకు బదలీ అయ్యారు. ఆయన సోదరుడు కూడా కానిస్టేబులే. జోహార్ ప్రమోద్.
News October 21, 2025
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అనంతరం 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఇవాళ APలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ నెల 23 ఉదయం 8.30 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.