News March 20, 2025
రామచంద్రపురం : పోలీసుల అదుపులో కసాయి తండ్రి..!

ఇద్దరు కన్న బిడ్డలను కాలువలో తోసేసి పరారైన రాయవరం (M) వెంటూరుకు చెందిన పిల్లి రాజు బుధవారం రామచంద్రపురం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. సోమవారం నెలపర్తిపాడు శివారు గణపతి నగరం సమీపంలోని పంట కాలువలో కారుణ్యశ్రీ (7), రామ సందీప్(10)ను తండ్రి రాజు పంట కాలువలో తోసేసిన విషయం తెలిసిందే. కారుణ్యశ్రీ మృత్యువాత పడగా సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు
Similar News
News October 14, 2025
చిత్తూరు: పరిశ్రమల స్థాపనకు చర్యలు

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయదారులకు సహకరించని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమలకు ప్రభుత్వం అందించే రాయితీలను నిలుపుదల చేయాలని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులు త్వరితగతిన మంజూరు చేస్తామన్నారు.
News October 14, 2025
కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా పదవులు: MP కావ్య

కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడి పని చేసిన కార్యకర్తలు, నాయకులకు తప్పకుండా పదవులు వస్తాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ కాంగ్రెస్ భవన్లో ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం, పార్టీ బలోపేతం దిశగా కార్యకర్తలు, నాయకుల సమిష్టి అభిప్రాయాల ఆధారంగా అధ్యక్షుడిని పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
News October 14, 2025
మర్పల్లి: తాగునీటి కోసం హోటల్స్కు విద్యార్థులు

మర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సమస్యలు అధికారుల కళ్లకు కనిపించడం లేదు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసి నీళ్లు తాగేందుకు రోడ్ల వెంబడి తిరుగుతూ హోటల్స్ను ఆశ్రయిస్తున్నారు. టీచర్లు కూడా తమకేమి పట్టనట్లు ఉంటున్నారు. చిన్నారులు రోడ్లపై తిరడం వల్ల ఎదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో మరి. హోటల్ యజమానులు దయతలచకుంటే వారి పరిస్థితి ఏంటి.? ఇప్పటికైనా అధికారులు పట్టించుకుంటారో లేదో.