News March 20, 2025

రామచంద్రపురం : పోలీసుల ఎదుట లొంగిపోయిన కసాయి తండ్రి

image

ఇద్దరు కన్న బిడ్డలను కాలువలో తోసేసి పరారైన రాయవరం (M) వెంటూరుకు చెందిన పిల్లి రాజు బుధవారం రామచంద్రపురం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. సోమవారం నెలపర్తిపాడు శివారు గణపతి నగరం సమీపంలోని పంట కాలువలో కారుణ్యశ్రీ (7), రామ సందీప్‌(10)ను తండ్రి రాజు పంట కాలువలో తోసేసిన విషయం తెలిసిందే. కారుణ్యశ్రీ మృత్యువాత పడగా సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు.

Similar News

News February 24, 2026

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హరిత తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో 9,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.

News February 24, 2026

ADB: 108 సిబ్బంది సేవలు అభినందనీయం

image

ఆపద సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా 108, 102 ఉత్తమ సేవల్లో హైలెట్ బెస్ట్ ఈఎంటీ, పైలట్ అవార్డులను మంగళవారం కలెక్టర్ అందజేశారు. ఈఎంటీ రేఖ, రాజేశ్వర్, పైలట్ శివకుమార్ ఈ అవార్డులను అందుకున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా కోఆర్డినేటర్ శేఖర్, మనోహర్ వసీం పాల్గొన్నారు.

News February 24, 2026

హనుమకొండ: పార్టీ నుంచి బీజేపీ నేత సస్పెండ్

image

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారన్న కారణంతో హనుకొండ జిల్లా రెడ్డిపురానికి చెందిన బీజేపీ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్‌పై పార్టీ వేటు వేసింది. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.