News March 19, 2025
రామచంద్రాపురం: బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

రావులపాలెం నుంచి సాలూరుకి వెళ్లే ఆర్టీసీ బస్సు మంగళవారం సాయంత్రం రామచంద్రాపురం మార్కెట్ సెంటర్ రామాలయం వద్ద బైక్పై వెళ్తున్న పల్లి జీవరత్నం(71) అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో వెంటనే స్థానికులు అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్బాడీని మార్చురీకి పంపించారు.
Similar News
News November 27, 2025
నెల్లూరు: ఫ్రీగా స్కూటీలు.. 30న లాస్ట్.!

దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 30 వరకు ప్రభుత్వం దరఖాస్తుల గడువును పొడిగించింది. 10పాసై, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారు ఇందుకు అర్హులు. జిల్లాలో ఇప్పటి వరకు 70 మంది అప్లై చేసుకున్నట్లు ఏడీ ఆయుబ్ తెలిపారు. అర్హులు APDASCELC.AP.GOVలో దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులు కోరారు.
News November 27, 2025
భారీగా పెరిగిన వెండి ధర.. తగ్గిన గోల్డ్ రేటు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్పై రూ.4,000 పెరిగి రూ.1,80,000కు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే వెండి ధర రూ.9వేలు ఎగబాకింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.160 తగ్గి రూ.1,27,750కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,17,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి
News November 27, 2025
సంగారెడ్డి: మూడు గ్రామాల్లోనే సర్పంచ్ ఎన్నికలు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో మూడు గ్రామాల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మండలంలో భానూర, నందిగామ, క్యాసారం గ్రామాలు మాత్రమే ఉన్నాయి. పటాన్చెరు మండలంలో గతంలో 28 గ్రామాలు ఉండగా అమీన్పూర్ మండలంగా, ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీలుగా ఏర్పడటంతో ఈ మూడు గ్రామాలే మిగిలాయి. దీంతో జిల్లాలోనే అతి చిన్న మండలంగా పటాన్చెరు మిగిలిపోయింది.


