News March 19, 2025
రామచంద్రాపురం: బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

రావులపాలెం నుంచి సాలూరుకి వెళ్లే ఆర్టీసీ బస్సు మంగళవారం సాయంత్రం రామచంద్రాపురం మార్కెట్ సెంటర్ రామాలయం వద్ద బైక్పై వెళ్తున్న పల్లి జీవరత్నం(71) అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో వెంటనే స్థానికులు అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్బాడీని మార్చురీకి పంపించారు.
Similar News
News October 16, 2025
నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే: అమిత్షా

ఛత్తీస్గఢ్లో ఇవాళ 170 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారని, నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే అని కేంద్ర హోంమంత్రి అమిత్షా వెల్లడించారు. ‘ఛత్తీస్గఢ్లోని అభూజ్మఢ్, నార్త్ బస్తర్ నక్సల్ టెర్రర్ నుంచి విముక్తి పొందాయి. 2024 JAN నుంచి 2,100 మంది నక్సలైట్లు సరెండరయ్యారు. 1,785 మంది అరెస్టయ్యారు. 477 మంది హతమయ్యారు. 2026 MAR 31లోపు నక్సలిజం అంతరిస్తుందనడానికి ఈ నంబర్లు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.
News October 16, 2025
అమరావతి: 40 ఎకరాల భూమి ఇచ్చేందుకు రైతుల అంగీకారం

అమరావతి భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా 40.25 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కమిషనర్ కె. కన్నబాబు చర్చలు ఫలించాయి. ఉండవల్లిలో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు, కొండవీటి వాగు, ఇతర రోడ్ల నిర్మాణ పనుల కోసం 22 మంది రైతులు 12 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. పెనుమాకలో 14 మంది రైతులు 28.25 ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించారు.
News October 16, 2025
50% కోటాలో ఎన్నెన్ని స్థానాలంటే…

TG: సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించరాదని తేటతెల్లమైంది. స్థానిక ఎన్నికలు జరపాలనుకుంటే ఆ పరిధిలో మాత్రమే రిజర్వేషన్లుండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50%లోనే సీట్లు కేటాయించాలి. ప్రస్తుతమున్న12769 పంచాయతీల్లో 6384, MPTC 5745లో 2872, MPP 566లో 283, ZPP 32లో 16 రిజర్వేషన్ల కోటా కిందకు వస్తాయి. ఈ సీట్లలోనే SC, ST, BCలకు సీట్లు రిజర్వు చేయాలి. దీనికి మించి ఉండాలంటే పార్టీ పరంగా ఇవ్వాలి.