News February 16, 2025

రామతీర్థంలో 26 నుంచి శివరాత్రి జాతర

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు శివరాత్రి జాతర మహోత్సవం జరగనుంది. 26, 27 తేదీల్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు జాగరణ చేస్తారు. 28న వేద పారాయణం అనంతరం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపిస్తారు. జాతరకు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News March 21, 2025

VZM: నకిలీ బంగారం ముఠా అరెస్ట్

image

కైకలూరులో గోల్డ్ షాపుల్లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెడుతున్న ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా మెంటాడకి చెందిన CH మణికంఠ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడ్డాడు. ఓ షాప్‌లో బంగారు నగలు అని తాకట్టు పెట్టి రూ.90,000 తీసుకున్నారు. మరో షాప్‌లో కూడా ఇలానే చేయగా షాప్ యజమానికి అనుమానం వచ్చి ప్రశ్నించాడు. దీంతో నిందితులు చాకు చూపించి రూ.1,50,000తో పరారైనట్లు కేసు నమోదు అయ్యింది.

News March 21, 2025

VZM: ఇళ్ల లబ్దిదారులకు ఉచితంగా ఇసుక: కలెక్టర్

image

ఇళ్ల లబ్దిదారులకు ప్ర‌భుత్వం అందిస్తున్న అద‌న‌పు సాయాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కలెక్ట‌ర్ అంబేడ్కర్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు. అద‌నంగా ఆర్ధిక సాయం చేయ‌డ‌మే కాకుండా, ఇసుక‌ను కూడా ప్ర‌భుత్వ‌మే ఉచితంగా ఇస్తోందన్నారు. ల‌బ్దిదారులు వీటిని వినియోగించుకొని స‌కాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల‌న్నారు. ప్ర‌స్తుతం ఇళ్ల నిర్మాణానికి అనుకూల‌మైన స‌మ‌య‌మ‌ని చెప్పారు.

News March 20, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బేబినాయన భేటీ

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన గురువారం భేటీ అయ్యారు. అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు. బాడంగి మండలం గొల్లాదిలో వేగవతి నదిపై వంతెన ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పామని వంతెన నిర్మాణానికి సహకరించాలని కోరారు. వంతెన నిర్మాణం పూర్తయితే నిర్మాణం వలన బాడంగి, రాజాం, దత్తిరాజేరు, మెరకముడిదాం గ్రామాల ప్రజలకు  ఉపయోగపడుతుందన్నారు.

error: Content is protected !!