News March 25, 2024
రామతీర్థం పుణ్యక్షేత్రంలో ఘనంగా డోలోత్సవం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో డోలోత్సవం కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి పర్వదినం సందర్భంగా రామస్వామి ఆలయంలోని గోవిందరాజ స్వామి, సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను కొండ వద్ద ఉన్న మండపం వద్దకు అర్చకులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, డోలోత్సవం జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Similar News
News February 28, 2026
విజయనగరం జిల్లాను ఉద్యాన వనంగా తీర్చి దిద్దుతాం: సీఎం

విజయనగరం జిల్లాలో వచ్చే రెండేళ్లలో పండ్ల తోటల పెంపకానికి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరో రెండేళ్లలో ఇది కార్యరూపం దాలుస్తుందన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న మొక్కజొన్న వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నారు. ఇకపై భవిష్యత్తులో పండ్లతోటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు. దీనికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు.
News February 27, 2026
VZM: జిల్లాలో 2.69 లక్షల మందికి రూ.114.83 కోట్ల పంపిణీ

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద శనివారం 2,69,748 మందికి రూ.114.83 కోట్లు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రావివలస గ్రామ సచివాలయ పరిధిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 36,903 మందికి రూ.15.80 కోట్లు, చీపురుపల్లి మండలంలో 8,431 మందికి రూ.3.56 కోట్లు, రావివలస గ్రామంలో 387 మందికి రూ.16 లక్షలు అందజేయనున్నారు.
News February 27, 2026
చీపురుపల్లి: సీఎం వస్తున్నారు.. కీలక ప్రకటన ఉంటుందా..!

చీపురుపల్లి(M) రావివలసలో శనివారం CM చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో నియోజకవర్గంలో పలు సమస్యలపై సీఎం ప్రకటన చేస్తారని ప్రజలు నిరీక్షిస్తున్నారు. సుమారు 80 వేల మంది కోరుకుంటున్న RECS పునరుద్ధరణ, తోటపల్లి పిల్ల కాలువల నిర్మాణం, చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి, గరివిడి పశుసంవర్ధక కళాశాలకు అదనపు భవనాలు మంజూరు, చీపురుపల్లిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తిపై హామీ కోసం ఎదురుచూస్తున్నారు.


